Dealing: అర్దరాత్రి ముంబాయి మేడమ్స్ తో చెడింది, పోలీసులపై దాడి, అమ్మాలు+లాయర్ల పంచాయితీతో !
ముంబాయికి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కు చెందిన ఇద్దరు యువతులు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ ముందే లాయర్లతో భేరం కదురక నానా హంగామా చెయ్యడం, పోలీసులకు గాయాలు కావడం కలకలం రేపింది.
బెంగళూరు/దావణగెరె: ముంబాయి అమ్మాయిలు, ఆంటీలకు భలే క్రేజ్ ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. చాలాసార్లు ఈ వియషంలో జోరుగా చర్చ కూడా జరిగింది. ఇక బాలీవుడ్ ఉండేది కూడా ముంబాయి నగరంలోనే కావడంతో అక్కడ సినిమాల్లో నటించాలని, టీవీ సీరియల్స్ లో యాక్ట్ చెయ్యాలని చాలా మంది అమ్మాయిలు ముంబాయి వెలుతుంటారు. ఇక ముంబాయిలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు ఏమాత్రం కొదవలేదు అనే విషయం తెలిసిందే. అలాంటి ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కు చెందిన ఇద్దరు యువతులు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ ముందే లాయర్లతో భేరం కదురక నానా హంగామా చెయ్యడం, పోలీసులకు గాయాలు కావడం కలకలం రేపింది.

అర్దరాత్రి పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిలు ?
కర్ణాటకలోని దారణగెరె నగరంలో ఓ పోలీస్ స్టేషన్ ఎదుట హైడ్రామాకు తెరలీేపింది. ముంబాయికి చెందిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్దరాత్రి దావణగెరె పోలీస్ స్టేషన్ సమీపంలో ముంబాయికి చెందిన ఇద్దరు ఎర్రతోలు అమ్మాయిలు మాకు చెప్పిన డబ్బు మొత్తం ఇవ్వాలని, లేదంటే నానా రచ్చ చేస్తామని మరో ఇద్దరు మగాళ్లతో గొడవకుదిగారు.

మద్యం మత్తులో ఊగిపోయారు
ముందుగా కుదుర్చున్న డబ్బులు మాకు ఇస్తేనే ఇక్కడి నుంచి కదలుతామని, లేదంటే మీ అంతు చూస్తామని ఇద్దరు అమ్మాయిలు కర్ణాటకకు చెందిన ఇద్దరు మగాళ్తతో గొడవకుదిగారు. దావణగెరెలోని విద్యానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట యువతులు హైడ్రామాకు పాల్పడ్డటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.
మద్యం మత్తులో ఉన్న యువతులు వారితో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మీద, అడ్డు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డారని సమాచారం. ముంబాయి మగువల దాడిలో విద్యారణ్యపురలో ఉద్యోగం చేస్తున్న ఒక పోలీసు కానిస్టేబుల్ గాయాలైయి.

ఈవెంట్ మేనేజ్ మెంట్ తో లాయర్లు ?
ముంబాయికి చెందిన ఇద్దరు అమ్మాయిలను మంజునాథ్, హర్షా అనే ఇద్దరు వ్యక్తులు సంప్రధించారని తెలిసింది. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమం పేరుతో ముంబాయికి చెందిన ఇద్దరు అమ్మాయిలను మంజునాథ్, హర్ష దావణగెరెకి పిలిచారని పోలీసులు అంటున్నారు, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని శికారిపూర్లో నివాసం ఉంటున్న మంజునాథ్, హర్షా లాయర్లు అని పోలీసులు అంటున్నారు.

డబ్బుల విషయంలో గొడవలు
ముంబాయి యువతులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో మంజునాథ్, హర్షాల మద్య గొడవ జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. పీకలదాక మద్యం మత్తులో ఉన్న ముంబాయి యువతులు, వారి సహచరులు దావణగెరె పోలీసులపై దాడికి పాల్పడ్డారు. నిందితుల దాడిలో ఒక పోలీసు గాయపడ్డాడు. ఈ మేరకు విద్యానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంజునాథ్, హర్షా అనే ఇద్దరితో పాటు ముంబాయికి చెందిన ఇద్దరు యువతులను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను బుధవారంరు కోర్టు ముందు హాజరుపరిచి వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications