వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ షేమ్: పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మంగళవారంనాడు ఆ మేరకు వార్తలు వచ్చాయి. అయితే, సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా ఓ ముఠా అమ్మాయిని పట్టుకుని ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.
అత్యాచార సంఘటనను ఎంఎంఎస్ క్లిప్గా రూపొందించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని తెలుస్తోంది. ఓ వ్యక్తికి అమ్మాయికి పరిచితుడని సమాచారం.
ఐదుగురు నిందితుల్లో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
English summary
In a shocking incident, a class 10th student was gang-raped by five people in Delhi's Uttam Nagar area, as per news reports on Tuesday.
Story first published: Tuesday, July 29, 2014, 11:32 [IST]