బెంగళూరు ప్రజలకు ఏడాదికి తాగునీళ్లు ఎంత కావాలంటే ?, పక్కాక్లారిటీ ఇచ్చిన డీసీఎం, అదీలెక్క !
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు సిటీతో పాటు పరిసర ప్రాంతాలలో తాగునీటి అవసరాల కోసం ఏటా 24 టీఎంసీల కావేరీ నీటిని రిజర్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని బీడబ్ల్యూఎస్ఎస్ బీ (BWSSB) అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
బుధవారం ఢిల్లీలోని కర్ణాటక భవన్లో డీసీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇంతకుముందు తక్కువ నీరు కర్ణాటక ఉపయోగించుకుందని డీకే శివకుమార్ అన్నారు.

ఇప్పుడు మిగిలిన 6 టీఎంసీల నీటిని ఉపయోగించి, బెంగళూరు మొత్తం తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించామని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ 89వ సమావేశంలో మేకేదాటు డ్యామ్ అంశాన్ని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారని డీకే శివకుమార్ అన్నారు.
మేకదాటు ప్రాజెక్టు అశంపై సమవేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. మేకేదాటు పథకం ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులకు, సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. ఈ మేకదాటు ప్రాజెక్ట్ ఆపద సమయంలో నీటిని నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుందని, ఈ ప్రాజెక్ట్ వలన తమిళనాడు మరింత ప్రయోజనం పొందుతుందని డీకే శివకుమార్ అన్నారు.

కావేరిలో ఎంత నీరు మిగిలి ఉంది, ఎంత ప్రవహిస్తోంది, ఎంతమేరకు వినియోగిస్తున్నారు తదితర పూర్తి సమాచారాన్ని అధికార యంత్రాంగం ముందు కర్ణాటక అధికారులు వివరించారని, కష్టకాలంలోనైనా 300-400 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్ చేసిందని డీకే శివకుమార్ అన్నారు. కేఆర్ఎస్కు ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని, ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నామని డీకే శివకుమార్ అన్నారు.
బెంగుళూరుకు 24 టీఎంసీల నీటి వినియోగంపై తమిళనాడు అభ్యంతరం చెబుతుందని, బెంగళూరు ప్రజల తాగునీటికే మా మొదటి ప్రాధాన్యత ఉంటుందని, మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. తమిళనాడు ఏమైనా అభ్యంతరం చెప్పినా మేము పట్టించుకోమని, మా హక్కులను మేము ఎందుకు వదులుకోవాలని అని డీకే శివకుమార్ అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications