వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు, జేఎన్యూ విద్యార్థికి కూడా
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
సాయిబాబాతో పాటు ఓ జేఎన్యూ విద్యార్థి, మరో ముగ్గురిని జిల్లా న్యాయస్థానం నేరస్తులుగా గుర్తించింది. వారికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు మళ్లీ అరెస్టు చేయనున్నారు.
దీనిపై సాయిబాబా, ఇతరులు అప్పీలుకు వెళ్లవచ్చు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాయిబాబాను పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి 9 మే 2014న అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Comments
English summary
Gadchiroli court convicts DU professor G Saibaba for Maoists links, sentenced to life imprisonment.
Story first published: Tuesday, March 7, 2017, 15:54 [IST]