Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్పుడు ప్రధానిని.. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని ఆడిస్తున్నారు: కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు

భోపాల్: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దామోహ్‌లో బీజేపీ తరపున ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు దేశం గర్వపడుతోందన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేరని చంద్ర గ్రహం మీదకు భారత్ చేరిందని చంద్రయాన్-3 గురించి మోడీ చెప్పారు. జీ20 సదస్సును ప్రపంచం ప్రశంసించిందన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. క్రీడా రంగంలోనూ ఎన్నడూ లేని విధంగా పతకాల పంట పండుతోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. దేశంలో పేదరికాన్ని తుచిచేస్తామంటూ కాంగ్రెస్ గత 50 ఏళ్లకుపైగా చెప్పుకుంటూ వస్తోందని.. అయితే, ఆ దిశగా మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకోవడం లేదన్నారు.

 Earlier PM Used To Operate Via Remote Control, Now Its Congress President: PM Modi slams congress

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ పేదరికంలోకి వెళుతుందని హెచ్చరించారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ రాష్ట్రాన్ని తిరిగి బిమారూ రాష్ట్రంగా మారుస్తుందన్నారు. '2014లో (కేంద్రంలో) మేము (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. నేను కాంగ్రెస్ అవినీతి యంత్రాల టైర్లన్నీ పంక్చర్ చేసాను. కాంగ్రెస్ అవినీతి యంత్రం భరించలేని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ 'త్రిశక్తి'ని సృష్టించాము. "అన్నారాయన.

గత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆపరేట్‌ చేశారని ఆరోపించిన ఆయన.. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పరిస్థితి కూడా అలాగే ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ.
రిమోట్‌ ఆన్‌లో ఉండగానే సనాతన్‌ని దుర్భాషలాడాడు.. కానీ రిమోట్‌ ఆఫ్‌ చేయగానే సనాతన్‌ గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో 5 మంది పాండవులు ఉన్నారంటూ వారన్నారని.. తాము పాండవుల మార్గంలో నడుస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు.

దామోహ్ తర్వాత బుందేల్‌ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరో రెండు ర్యాలీలు కూడా నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 230 మంది సభ్యులున్న శాసనసభకు నవంబర్ 17న సింగిల్ ఫేజ్ ఓటింగ్ జరగనుండగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణలతో పాటు డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+