ఈసీ మీట్: 5 రాష్ట్రాల్లో ఇంటింటా ప్రచారం, ర్యాలీలపై డిస్కషన్
ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలకు సంబంధించి బుధవారం సమావేశం కానుంది. మంగళవారం కూడా ఈసీ సమావేశమై.. కీలక అంశాలను చర్చించింది.
కరోనా వల్ల పోలింగ్ స్టేషన్ల పెంపు గురించి చర్చించారు. దీంతో భౌతిక దూరం వీలవుతుందని.. వేరియంట్ విస్తరించే అవకాశం ఉండదని అంచనా వేసింది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి రూల్స్ చెప్పడం.. వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించడం.. ఓటు వేసే సమయంలో గల నియమాలను చెప్పడం గురించి డిస్కష్ చేశారు.
5 రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మొహరింపు, వీవీప్యాట్ల నిర్వహణ బాధ్యత.. స్ట్రాంగ్ రూమ్, రీమోట్ ఏరియాకు తరలించే బాధ్యత గురించి డిస్కష్ చేశారు. రాజకీయ పార్టీల ప్రచారం.. పోలింగ్ స్టేషన్కు రాజకీయ పార్టీల బూత్ ఉండాల్సిన స్థానం గురించి డిస్కష్ చేశారు. సమావేశాలు, ఫంక్షన్ల గురించి మాట్లాడారు. ఇంటింటి ప్రచారం.. ర్యాలీలకు సంబంధించి చర్చించారు.

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ఒమిక్రాన్ టెన్షన్తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆఖరు వరకు కర్ఫ్యూ.. లేదంటే స్వల్పంగా లాక్ డౌన్ విధించే సిచుయేషన్ అయితే ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. రోజు రోజుకు అయితే కేసులు మాత్రం పెరగడం కాస్తం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.












Click it and Unblock the Notifications