MLAs: రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసిన ఏక్ నాథ్, మీ సెక్యూరిటీ భాద్యత నాదే !
ముంబాయి/ గుహవాటి/ న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మనం అందరూ ముంబాయి వెలుతున్నామని, మీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే భాద్యత తనదే అని ఎమ్మెల్యేలకు ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారని తెలిసింది. ఆదివారం గుహవాటిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన ఏక్ నాథ్ షిండే ప్రస్తుత విషయాలపై చర్చించారని తెలిసింది. రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వస్తారని ఇన్ని రోజులు ఎదురు చూసిన సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు, వారి ఆఫీసుల మీద దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యారు. శివసేన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలను శివసేన కార్యకర్తలు ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టారు. ఈ సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న సమయంలో రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే వారికి ధైర్యం చెబుతున్న సమయంలో తీసిన ఫోటో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.
CM son: మీకు దమ్ముంటే ఆపని చెయ్యండి, మా పార్టీ సింబల్, మా తాత ఫోటోలు, సీఎం కొడుకు వార్నింగ్ !
దాడులు చేస్తున్న శివ సైనికులు
రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వస్తారని ఇన్ని రోజులు ఎదురు చూసిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల నివాసాలు, వారి ఆఫీసుల మీద దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యారు. శివసేన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలను శివసేన కార్యకర్తలు ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టారు.
మంత్రి జంప్ తో ఏక్ నాథ్ టీమ్ లో ఉత్సాహం
మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖా మంత్రి ఉదయ్ సామంత్ ఆదివారం అసోంలోని గుహవాటి చేరుకుని ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలపడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హడలిపోయింది. అయితే మంత్రి ఉదయ్ సామంత్ రాకతో ఏక్ నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేల్లో ఇంకా ఊపు వచ్చిందని వారి వర్గంలోని ఓ నాయకుడు అంటున్నారు.
ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పిన ఏక్ నాథ్
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మనం అందరూ ముంబాయి వెలుతున్నామని, మీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే భాద్యత తనదే అని ఎమ్మెల్యేలకు ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారని తెలిసింది.
ముంబాయి టూర్ కు డేట్ ఫిక్స్ చేసిన ఏక్ నాథ్ షిండే
ఆదివారం గుహవాటిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన ఏక్ నాథ్ షిండే ప్రస్తుత విషయాలపై చర్చించారని తెలిసింది. రెండు రోజుల్లో మనం అందరూ ముంబాయి వెలుతున్నామని ఏక్ నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలకు చెప్పారని తెలిసింది. శివసేన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న సమయంలో రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే వారికి ధైర్యం చెబుతున్న సమయంలో తీసిన ఫోటో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.