దినకరన్కు మద్దతు: ఆరుగురు అన్నాడీఎంకే నేతలపై వేటు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్కు మద్దతిచ్చిన అన్నాడీఎంకేలో ఆరుగురు నేతలపై వేటు పడింది. సోమవారం జరిగిన అన్నాడీఎంకే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పరాజయంపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. అనంతరం ఎస్ వెట్రివేల్, తంగ తమిల్ సెల్వర్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్ పార్థిబన్లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

టీటీవీ దినకరన్కు మద్దతిచ్చి వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తొలగించినట్లు అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ పై 40వేలకుపైగా మార్జిన్ తో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపు తర్వాత తానే దివంగత సీఎం జయలలిత నిజమైన వారసుడినని వ్యాఖ్యానించారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications