మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!
ఢిల్లీ : మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా ప్రభుత్వ నివాస గృహాలు ఖాళీ చేయని ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారం రోజుల పాటు గడువు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కోరింది. ఒకవేళ మొండికేస్తే గడువిచ్చిన వారంలో చివరి మూడు రోజులు కరెంట్, వాటర్ సప్లై కట్ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
లుటెయిన్స్ ప్రాంగణంలోని పలు నివాసాల్లో చాలామంది మాజీ ఎంపీలు ఇంకా అక్కడే ఉంటున్నారు. పదవీకాలం ముగిసినా కూడా ఇంకా బంగ్లాలు ఖాళీ చేయకుండా ఉన్న మాజీలు ఇకపై అక్కడ ఉండేందుకు వీల్లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ క్రమంలో ఆయా బంగ్లాల నుంచి మాజీలను ఖాళీ చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు హౌసింగ్ కమిటీ ఛైర్మన్ సీఆర్ పాటిల్.

మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!
పార్లమెంట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దేశ రాజధానిలో ఉండేందుకు ప్రభుత్వ నివాస గృహాలు కరువయ్యాయి. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొత్త ఎంపీలు నివాసముండటానికి బంగ్లాలు సరిపోవడం లేదని సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే కొన్ని నివాస సముదాయాలకు అవసరమైన మేర మరమ్మతులు చేయించి కొత్త ఎంపీలకు అందించనున్నట్లు మోడీ ప్రకటించారు.
అదలావుంటే లుటెయిన్స్ ప్రాంగణంలో మాజీ ఎంపీలు దాదాపు 200 మంది వరకు ఇంకా అక్కడే నివాసముంటున్నట్లు తేలింది. 16వ లోక్సభ రద్దు అయినప్పటికీ ఇంకా వారు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా సభ రద్దు నాటి నుంచి నెల రోజుల్లోగా ఆ బంగ్లాలు వేకెట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మాజీ ఎంపీలు జూన్ 25 నాటికే ఖాళీ చేయాల్సి ఉంది. గడువు ముగిసి రెండు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకు వారు ఖాళీ చేయకపోవడం గమనార్హం.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications