Fact check : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో కోత పెట్టబోతున్నారా?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఫేక్ న్యూస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై పలు నిరాధార కథనాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ రాయితీ(ఎల్టీసీ) సహా పలు అలవెన్సుల్లో మోదీ సర్కార్ కోత విధించబోతుందని హిందీలో ఓ వార్తా కథనం వెలువడింది.
Recommended Video
సాధారణంగా ఎల్టీసీ పీరియడ్లో ప్రభుత్వం వేతనంతో కూడిన లీవులను మంజూరు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అందులో కోత పెట్టబోతోందని,మెడికల్ రీయింబర్స్మెంట్లోనూ కోత తప్పదని ప్రచారం జరుగుతోంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వోద్యోగులకు వచ్చే లీవ్ ఎన్క్యాష్మెంట్లోనూ కోత తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఏ అధికారిని సంప్రదించకుండానే సదరు రిపోర్టర్ ఆ వార్తను ప్రచురించారని.. అవి అతని సొంత ఊహాగానాలే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. కేంద్రం వివరణతో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం లభించినట్టయింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications