Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటకలో రూ.7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత, ఒకరి అరెస్ట్

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. అయితే నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని బెలగవిలో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం నాడు పోలీసుల తనిఖీలో సుమారు రూ. 7 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పోలీసులకు పట్టుబడింది.

కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరిగా తలపడుతున్నాయి. అధికారాన్ని తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనిబిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Fake currency worth Rs 7 cr seized from Belagavi, Ahead of Karnataka polls

ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడడం కలకలం రేపుతోంది. నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే నకిలీ కరెన్సీని తీసుకొచ్చారని భావిస్తున్నారు.

మంగళవారం నాడు కూడ ఓ ప్రైవేట్ బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన చోటు చేసుకొని 24 గంటలు కూడ కాకముందే సుమారు రూ. 7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కరెన్సీని పంచేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే కరెన్సీ తరలిస్తుండగా పట్టుబడినట్టు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+