మృతి: వరదల్లో 7గురు, రోడ్డు ప్రమాదం మరో 7గురు
గౌహతి/జైపూర్: అస్సాంలో కురిసిన 15 గంటల ఏడతెరిపిన లేని వర్షానికి రాజధాని గౌహతి తోపాటు నాలుగు జిల్లాల్లో రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
కొండచరియలు విరిగిపడి ముగ్గురు, విద్యుదాఘాతంతో మరో నలుగురు మృత్యువాతపడ్డారు.
గౌహతి నగరంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. అస్సా ముఖ్యమంత్రి తరుణ్ గోగొయ్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు బాధితులకు పునరావా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంటోంది.

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జైసల్మేర్ జిల్లాలోని కీటా ఫాంటా ప్రాంతంలో కార్మికులతో ప్రయాణిస్తున్న ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు డిఎస్పి అశోక్ మీనా తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications