కేరళ వరద బాధితులకు కేంద్రం అండ, రూ.200కే ఎల్పీజీ కనెక్షన్
తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు కేంద్రం ఓ ఊరట కల్పించింది. వారికి రూ.200కే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ను అందించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్లు, వాకిళ్లు కోల్పోయారు.
బాధితులు రిలీఫ్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇళ్లలో బురదతో నిండిపోయిన సామాగ్రి ఉంది. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టింది.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ను ఇవ్వాలని, మిగతా వారికి రూ.1200కు ఇవ్వాలని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ ప్రతిపాదన పెట్టారు.

ఈ ప్రతిపాదనను పరిశీలించిన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర అంగీకరించారు. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొందేందుకు రూ.1400 చెల్లించాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అన్ని ఆయిల్ కంపెనీలకు కేంద్రమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళ వరదల కారణంగా దాదాపు 480 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
-
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
మంత్రి రాస'లీలలు'.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications