అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు జంప్, మాజీ సీఎం గుర్తుకు వచ్చారు, అయితే !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. 2019లో కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఇప్పుడు అదే బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. బెంగళూరులోని యశవంతపురం ఎమ్మెల్యే ఎస్టీ. సోమశేఖర్, యల్లాపూర్ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్, కేఆర్పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ సహా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కలవరపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019లో యడ్యూరప్ప నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మళ్లీ మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పకు బీజేపీ హైకమాండ్ అప్పగించిందని బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు.

17 మంది ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరితే 2024 జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 15 స్థానాలు బీజేపీ దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.2019లో రాష్ట్రంలో గెలిచిన 28 సీట్లను బీజేపీ నిలబెట్టుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పతో ఫోన్లో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బీఎస్ యడ్యూరప్ప మాటలను పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, పాత మైసూర్కు చెందిన నాయకులు పట్టించుకోవడం లేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న హైకమాండ్ ఒక్కలిగ వర్గానికి చెందిన ఇతర రాష్ట్ర నాయకులైన సిటీ రవి, శోభా కరంద్లాజే, డీవీ సదానంద్ గౌడ్లకు ఎమ్మెల్యేలను అడ్డుకునే పనిలో పడ్డారు.

కాంగ్రెస్లో చేరేందుకు సిద్దం అవుతున్న బెంగళూరు నగరంలోని యశవంతపురంఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యశవంతపురం లోని స్థానిక బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సోమశేఖర్ కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వ్యూహం రచించారని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ కార్యకర్తలు సీఎం మారెగౌడ, ధనంజయలను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఇది కూడా సోమశేఖర్ని ఒప్పించేందుకు చేసిన చివరి ప్రయత్నమని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు సొంత పార్టీలోకి, అందులో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని జోరుగా ప్రచారం జరగడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications