ఇద్దరు మాజీ సీఎంలు అరెస్టు, అసలు మ్యాటర్ తో షాక్, అధికార పార్టీ, సీఎం డీల్ తో !
బెంగళూరు: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కావేరి (cauvery)నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం బెంగళూరులో (Bengaluru) బీజేపీ (bjp) నిరసన చేపట్టింది. ఈ సమయంలో మైసూరు బ్యాంకు సర్కిల్లో కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్ తో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కావేరీ (cauvery)జలాల సమస్యతో పాటు వివిధ అంశాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఖండిస్తూ శనివారం బెంగళూరులోని (Bengaluru) మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, డీవీ సదానందగౌడ్, బీజేపీ (bjp) ఎంపీ పీసీ మోహన్, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్థనారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విధాన పరిషత్ సభ్యులు, బీజేపీకి చెందిన నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనిపై మాట్లాడిన మాజీ డీసీఎం గోవింద కారజోల కావేరీ (cauvery)జలాల అంశంతోపాటు వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బెంగళూరులోని (Bengaluru) మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద ఈరోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. తక్షణమే తమిళనాడుకు నీటి సరఫరా నిలిపివేయాలని బీజేపీ (bjp) నాయకులు డిమాండ్ చేశారు.

కావేరి (cauvery) పరివాహక ప్రాంత ప్రజలు నీటి కోసం మోచేతినీళ్లు తాగాల్సిన పరిస్థితి ఎదురైయ్యిందని బీజేపీ (bjp) నాయకులు విచారం వ్యక్తం చేశారు. కర్ణాటక, కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ పీసీ మోహన్ మండిపడ్డారు. తమిళనాడులో మంచి వర్షాలు కురిసినా, కర్ణాటకలో నీరు లేకున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేస్తున్నారని బీజేపీ (bjp) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతల కావేరి (cauvery)పోరు తీవ్రరూపం దాల్చడంతో.. ముందుజాగ్రత్త చర్యగా మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్ తో పాటు బీజేపీ (bjp) నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు సీఎం (cm) స్టాలిన్ తో డీల్ మాట్లాడుకున్నారని, ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా కూటమిలో ఈ డీల్ జరిగిందని కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు ఆరోపించారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications