మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి(93) కన్నుమూత, సందర్శన అనంతరం అంత్యక్రియలు
Recommended Video

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి(93) గురువారం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి కొన్ని రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజపేయి జూన్ 12న ఎయిమ్స్లో చేరారు. వాజపేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్తోపాటు డిమెన్షియా ఉంది.
శుక్రవారం అంత్యక్రియలు
గురువారం సాయంత్రం వాజపేయి పార్థీవ దేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఉదయం 9గంటలకు బీజేపీకి కార్యాలయానికి వాజపేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సందర్శకులకు అనుమతిస్తారు.
శుక్రవారం మ. 1.30గంటలకు అంతిమయాత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4గంటలకు రాజ్ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్థల్లో వాజపేయి పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా, వాజపేయి ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించడంతో బీజేపీ తన గురువారం నాటి అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్లో వాజపేయిని పరామర్శించారు.
గురువారం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతోపాటు బీజేపీ ముఖ్య నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా వాజపేయిన ఎయిమ్స్లో పరామర్శించారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా వాజపేయిని పరామర్శించారు. మంగళవారం ఉదయం వాజపేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్పేయిని పరామర్శించారు.
Former Prime Minister #AtalBihariVajpayee passes away at 93..#RipAtalBihariVajpayee pic.twitter.com/YwemzeqVXW
— Oneindia Telugu (@oneindiatelugu) August 16, 2018
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications