స్కిల్స్ లేకనే ఐదుగురిలో 4గురు ఇంజనీర్లకు ఉద్యోగాలు రావడం లేదు: దీపక్ ఫరేఖ్
ఉపాధ్యాయయులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ దీపక్ పరేఖ్ చెప్పారు.
చెన్నై: ఉపాధ్యాయయులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ దీపక్ పరేఖ్ చెప్పారు.
పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
దేశంలో 3,300లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలున్నాయని, సగటున ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కాలేజీల నుండి బయటకు వస్తున్నారని, అయితే వీరిలో తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రతి ఐదుగురిలో నలుగురికి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు.
ఐఐటి మద్రాస్ లో దీపక్ ఫరేఖ్ ఇనిస్టిట్యూట్ చెయిర్ ప్రారంభోత్సవన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం వేగంగా మారుతోందని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విధ్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.