యువతికి చుక్కలు చూపించిన Ola బైక్ రైడర్.. ఏమైందంటే..?
రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఓ యువతి తన ఓలా రైడ్ అనుభవాన్ని సామజిక మాధ్యమంలో పంచుకుంది. బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో బైక్ రైడర్ తో పాటు కిలోమీటరు వరకు నడిచానని తెలిపింది. అంతేకాక రూట్ మారినందుకు నా వద్ద అదనపు ఛార్జీ వసూలు చేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తన లింక్ డిన్ ఖాతాలో పోస్టు చేసింది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఆయుషి గుప్తా.. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేందుకు ఓలా బైక్ బుక్ చేసుకుంది. అయితే జర్నీ మధ్యలో బైక్ లో పెట్రోల్ అయిపోయిన కారణంగా రైడర్ బండి ఆపేశాడు. అయితే ఆ సమయంలో తన వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయని ఆ పోస్టులో పేర్కొంది ఆయుషి గుప్తా .. ఒకటి.. అక్కడితో రైడ్ ఎండ్ చేసి వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్లిపోవడం.. రెండూ.. ఆ సమయంలో డ్రైవర్ కు అండగా ఉండి సమీప పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లడం.. అయితే ఈ రెండింటిలో రెండో దాన్ని ఎంచుకున్నట్లు ఆయుషి గుప్తా చెప్పుకొచ్చింది.
A Jaipur-based woman narrated her Ola bike ride experience that turned into a lesson in empathy after she accompanied the driver to refuel his vehicle, arrived late, and still paid an extra charge for the detour.
— IndiaToday (@IndiaToday) November 3, 2025
Read in detail: https://t.co/XU0YDmyUWk#Jaipur #BikeService… pic.twitter.com/zdhEFFumBF
"మేము దాదాపు 1 కిలోమీటర్ వరకు బైక్ ను నెట్టుకుంటూ వెళ్లాం.. దాంతో నేను గమ్యానికి చేరుకోవాల్సిన సమయం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటలు అయింది. కానీ ఆ సమయంలో డ్రైవర్ ను అలా వదిలేయడం కష్టంగా అనిపించింది. నాకు కనీసం ఈవెనింగ్ వాకింగ్ అవుతుంది అని వెళ్లాను. పెట్రోల్ కొట్టించాడు. ఆ తర్వాత నన్ను ఇంటి వద్ద దింపాడు. నేను అతనికి రూ. 101 చెల్లించాను. అయితే ఆ రైడర్ మళ్లీ పిలిచాడు. మేడం రూ.7 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పెట్రోల్ బంక్ వరకు బండి వెళ్లిందని చెప్పాడు. నేను కన్ ఫ్యూజ్ అయ్యాను. మొత్తానికి మరో రూ. 7 ఇచ్చి ఇంట్లోకి వెళ్లాను" అని ఆయుషి గుప్తా చెప్పుకొచ్చింది.

"అయితే నేను మా అమ్మ ముందుకు వెళ్లి ఏడ్చాను. రూ. 7 అదనంగా తీసుకున్నందుకు కాదు.. ఆ సమయంలో రైడర్ కు అండగా పెట్రోల్ బంక్ వరకు నడిచాను. కానీ నాకు ఎంపతీ కనబడలేదని వాపోయాను. కానీ మా బ్రదర్ నా వైపు చూసి నవ్వాడు. ఇందులో అప్ సెట్ అవ్వడానికి ఏం ఉంది అన్నాడు. కానీ అమ్మ మాత్రం.. సొంత కష్టాల్లో ఉన్నవాళ్లు ఎదుటివారి దయా హృదయాన్ని గుర్తించలేరని తెలిపింది" అని ఆయుషి గుప్తా తనకు జరిగిన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంది. దీనిపై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications