Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాముడు, ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్నాయి, త్వరలో ఎంట్రీ ఇస్తా, గాలి జనార్దన్ రెడ్డి

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరిగిందని, శ్రీరాముడు, ఆంజనేయుడి ఆశ్వీరాదం తనకు ఉందని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. హమంతుడి ఆశీస్సులతో త్వరలో తాను మళ్లీ బళ్లారిలో కాలు పెడుతానని, ఆ రోజులు త్వరలోనే వస్తాయని తాను అనుకుంటున్నానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతిలోని అంజనాద్రిలో సోమవారం హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం సంతోషంగా ఉందని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట శుభకార్యం చాలా ఘనంగా జరగడంతో ముందుగా సంతోషించింది హనుమంతుడే అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

Gali Janardhan Reddy said that he has the blessings of Sri Rama and Anjaneyaswami

హనుమంత పుట్టింది కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో అని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నిర్వహించారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయోధ్యలో శ్రీరాముడికి, అంజనాద్రికి ఏకకాలంలో మహామంగళరాతి జరగడం శుభపరిణామం అని గాలి జనార్దన రెడ్డి అన్నారు. రామభక్తి అంటే దేశభక్తి అని, దేశ ప్రజలందరితో కలిసి హనుమంతుడు కూడా చాలా సంతోషించాడని, అదే సమయంలో ఇక్కడి అంజనాద్రిలో ఘనంగా పూజలు జరుపుకున్నామని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

Gali Janardhan Reddy said that he has the blessings of Sri Rama and Anjaneyaswami

అయోధ్యను అభివృద్ధి చేసినట్లే అంజనాద్రి అభివృద్ధి చేస్తామాని, ఆంజనేయుడిని నిత్యం ఆరాదిస్తామని, అంజనాద్రికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమంతుని సేవ కంటే గొప్ప తనకు గొప్ప డిగ్రీ లేదని, భగవంతుని సేవించే శక్తిని ఇవ్వాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

హనుమంతుడు కలియుగంలో మన మధ్య సజీవంగా ఉండే దేవుడు అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల పూజ సమయానికి గంగావతి నియోజక వర్గం నుంచి తుంగభద్ర నీటిని తీసుకుంటామని, బంగారు పూత పూసిన 108 కలశాలలో ఆ నీటిని తీసుకుంటామని, నేను ప్రత్యేకంగా రైలు మొత్తం బుక్ చేసుకుని అయోధ్యకు ఇక్కడి ప్రజలను తీసుకు వెలుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.

గంగావతి తాలూకాలోని ఆంజనేయడి కొండపైకి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడంతో సాధువులు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. అయోధ్యలో శ్రీరామ మూర్తి ప్రతిష్ఠాపన సందర్భంగా అంజనాద్రిలో దీపోత్సవం జరిగింది. అంజనాద్రిలోని 575 మెట్లను ప్రత్యేక దీపాలు, కర్పూరంతో వెలిగించి వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉండగా అంజనాద్రిలోని ఆంజనేయుడి ఆలయాన్ని ప్రత్యేక పూలతో చూడముచ్చటగా చాలా ఘనంగా అలంకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+