పాదచారులపైకి దూసుకెళ్ళిన వ్యాన్, ముగ్గురి మృతి, ఉగ్రదాడా?
బెర్లిన్: జర్మనీలోని మ్యూన్స్టర్ నగరంలో శనివారం ఓ ఉన్మాది పాదచారులపై తన వ్యానును నడిపాడు. దీంతో సుమారు ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు సుమారు 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జర్మనీలో మ్యూన్స్టర్ నగరంలోని కీపెన్కెర్ల్ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి వ్యానుతో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్ర కోణంలో ఏమైనా ఈ దాడి జరిగిందా అనే విషయమై కూడు ఆరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమనే అభిప్రాయాన్ని కొందరు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయిలో ఆధారాలు లభ్యం కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.