షాహీన్బాగ్లో కాల్పులు జరిపిన యువకుడు బీజేపీలో చేరిక: గంటల్లోనే తొలగింపు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపి సంచలనంగా మారిన 25 ఏళ్ల కపిల్ గుర్జర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పార్టీ నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు.
ఆ తర్వాత కపిల్ గుర్జర్ మాట్లాడుతూ.. హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీ కావడంతో తాను బీజేపీలో చేరినట్లు తెలిపాడు. అయితే, అతడు పార్టీలో చేరిన గంటల సమయంలోనే అతడ్ని బీజేపీ పార్టీ నుంచి తొలగించడం గమనార్హం. అతడ్ని పార్టీలో చేర్చుకోవడం పొరపాటుగా జరిగిందని స్థానిక నేతలు చెప్పడం గమనార్హం.

సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. పలుచోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి కూడా పాల్పడ్డారు. అయితే, ఫిబ్రవరి 1న కపిల్ గుర్జర్ ఓ తుపాకీతో ఆందోళనకారులకు హెచ్చరికగా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
అనంతరం కపిల్ గుర్జర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరి వివాహ వేడుక సమయంలో ఢిల్లీ వీధుల్లో రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారన్న కారణంతోనే తాను కాల్పులు జరిపినట్లు కపిల్ పోలీసులు విచారణలో వెల్లడించాడు. 2019 నుంచి తన తండ్రి.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు అతడి తండ్రి, కుటుంబసభ్యులు కూడా తోసిపుచ్చారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications