Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దమ్ముంటే రెఫరెండం నిర్వహించండి.. మమతా సవాల్

ఎన్‌ఆర్‌సీ దుమారం కేంద్రం ఉహించని విధంగా మలుపు తిరుగుతోంది. దేశంలోని ముస్లిం మైనారీటీ వర్గాలతో పాటు కాంగ్రెస్ ఇతర వాపపక్ష పార్టీలు , విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ముందుగా నిరసనలు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితం అవుతాయని అనుకున్నా ... రానురాను అవి ఇతర రాష్ట్రాలకు కూడ పాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి.

ఈ నేపథ్యంలోనే బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ... ఆమె కోల్‌కతా నిర్వహించిన ర్యాలీలో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా కేంద్రప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. మెజారీటి ఉందని బీజేపీ ఇష్టం వచ్చినట్టు చేస్తే... చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి అధ్యర్యంలో లేదా మానవహక్కుల కమీషన్ తో ఎన్ఆర్‌సీతోపాటు సిటిజన్ చట్టంపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రిఫరెండంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తే... ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మమతాబెనర్జీ సవాల్ విసిరారు.

go for a UN-monitored referendum over the amended Citizenship Act

నిరసలను శుక్రవారం కూడ కొనసాగించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ప్రజలు నిరసనలో సంయమనం పాటించాలని కోరారు. కాగా ఈ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరాటంగా తీర్చీదిద్దేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని , ప్రజలెవరు బీజేపీ ట్రాప్‌లో పడద్దని కోరారు. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం మీద బీజేపీ దాడులు చేయనున్నట్టు తమవద్ద సమాచారం ఉందని ఆమె తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+