Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతిఒక్కరికి పోలీసులు, ఆర్మీ రక్షణ కల్పించలేదు, సీఎం సంచలన వ్యాఖ్యలు!

హరియాణ/గురుగ్రామ్: హరియాణ రాష్ట్రవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి, ఇప్పటికే ఆరుగురు మరణించారు. అల్లర్లకు కారణమైన మోను మనేసర్ గురించి రాష్ట్రంలో ఎలాంటి సమాచారం లేదని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హరియాణనా రాష్ట్ర ప్రజలందరికీ పోలీసులు, ఆర్మీ రక్షణ కల్పించలేదని, ప్రజలు శాంతి, సామరస్యాలను కాపాడాలని సీఎం ఖట్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మత ఘర్షణలకు కారణమైన మోను మనేసర్ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, రాజస్థాన్ ప్రభుత్వం అతనిపై కేసు నమోదు చేసిందని మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాకు చెప్పారు. అతని జాడ కోసం ఏదైనా సహాయం అవసరమైతే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తాను రాజస్థాన్ ప్రభుత్వానికి హామీ ఇచ్చానని, ఇప్పుడు రాజస్థాన్ పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని హరియాణ సీఎం ఖట్టర్ అన్నారు.

Haryana CM Khattar made sensational remarks that police and army have not provided protection to everyone

మోను మనేసర్ ఆచూకీ గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు సీఎం మనోహర్ లాలా ఖటర్ చెప్పారు. ఫిబ్రవరి నుంచి రాజస్థాన్‌లోని ఇద్దరు వ్యక్తుల జంట హత్యల కేసులో మోను మనేసర్ పరారీలో ఉన్నాడు. కానీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్న వీడియోను ప్రసారం చేసి కొందరికి ఆగ్రహం తెప్పించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

నుహ్‌లోని విశ్వహిందూ పరిషత్ మతపరమైన ఊరేగింపులో మోను మనేసర్ కనిపిస్తారనే పుకార్లు హరియాణలో వివాదానికి దారితీశాయి. విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మసీదుకు నిప్పు పెట్టారు. వందకు పైగా వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు.

సోమవారం, హింస ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లోని నాగరిక ప్రాంతాలకు చేరుకుంది, అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. సామూహిక సమావేశాలు నిషేధించబడ్డాయి, కర్ఫ్యూలు విధించబడ్డాయి, అయితే మంగళవారం 200 మంది వ్యక్తుల బృందం నిబంధనలను ధిక్కరించి, రెసిడెన్షియల్ సొసైటీకి సమీపంలో ఉన్న రెస్టారెంట్లు, గుడిసెలకు, గురుగ్రామ్ లోని రెస్టారెంట్లు, షాపులకు, హోటల్స్ కు నిప్పు పెట్టారు.

Haryana CM Khattar made sensational remarks that police and army have not provided protection to everyone

అల్లర్లు నివారించడానికి పెట్రోల్ లేదా డీజిల్‌ను రిటైల్‌గా అమ్మడాన్ని హరియాణ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఘటనను ఖండిస్తూ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఢిల్లీ అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి, ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నానా ఇబ్బందిపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇప్పటివరకు 116 మందిని అరెస్టు చేశామని, 190 మందిని అదుపులోకి తీసుకున్నామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హింసకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని, అల్లర్ల వల్ల జరిగిన నష్టాన్ని రికవరీ చేస్తామని హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+