అలర్ట్: ముంబై తీరంలో ఎగిసిపడ్తున్న అలలు(పిక్చర్స్)
ముంబై: మహారాష్ట్రలోని ముంబై తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీ అలలు పొటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శుక్రవారం నుంచి జూన్ 18 వరకూ తీరప్రాంతంలో అలలు 4.5 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తువరకూ పోటెత్తవచ్చని, ప్రజలను సముద్ర తీరంవైపు అనుమతించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రజలను సముద్రం వైపు వెళ్లనీయకుండా చూసేందుకు ఇప్పటికే భద్రతా సిబ్బందిని నియమించారు. ముంబై నగర వ్యాప్తంగా విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశారు. కాగా, సముద్రపు అలలు తీరం వెంబడి ఉన్న రహదారులపైకి రావడంతో పలువురు పెద్దలు, చిన్నారులు అక్కడి చేరుకుంటున్నారు. నీటిలో తడుస్తూ కేరింతలు కొడుతున్నారు.

ఎగిసిపడుతున్న అలలు
మహారాష్ట్రలోని ముంబై తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గురువారం సాయంత్రం నుంచి అలలు పోటెత్తుతున్నాయి.

ఎగిసిపడుతున్న అలలు
ముంబై తీర ప్రాంతంలో ఎగిసి పడుతున్న అలలను చూసేందుకు భారీగా తరలివచ్చిన నగరవాసులు.

ఎగిసిపడుతున్న అలలు
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీ అలలు పొటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది.

ఎగిసిపడుతున్న అలలు
భారీగా ఎగిసిపడుతున్న అలల కారణంగా శుక్రవారం ఉదయం ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎగిసిపడుతున్న అలలు
శుక్రవారం నుంచి జూన్ 18 వరకూ తీరప్రాంతంలో అలలు 4.5 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తువరకూ పోటెత్తవచ్చని, ప్రజలను సముద్ర తీరంవైపు అనుమతించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఎగిసిపడుతున్న అలలు
సముద్రపు అలలు తీరం వెంబడి ఉన్న రహదారులపైకి రావడంతో పలువురు పెద్దలు, చిన్నారులు అక్కడి చేరుకుంటున్నారు. నీటిలో తడుస్తూ కేరింతలు కొడుతున్నారు.

ఎగిసిపడుతున్న అలలు
భారీగా అలలు పోటెత్తుతున్న నేపథ్యంలో గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రజలను సముద్రం వైపు వెళ్లనీయకుండా చూసేందుకు ఇప్పటికే భద్రతా సిబ్బందిని నియమించారు.












Click it and Unblock the Notifications