ఇండియన్ ఏరో స్పేస్లోకి ప్రేవేట్ ప్లేయర్... ఆ మైల్స్టోన్ని చేరిన మొట్టమొదటి హైదరాబాద్ స్టార్టప్...
భారత్లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్లో ఈ మైల్ స్టోన్ని చేరిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ప్లేయర్ స్కైరూట్ కావడం గమనార్హం.
భారత ఏరో స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయి నుంచి పొందిన స్పూర్తితో స్కైరూట్ ముందడుగు వేసింది. విక్రమ్ సిరీస్ పేరుతో స్పేస్లో ఉపయోగించే కొన్ని వాహనాలను అభివృద్ది చేస్తోంది. చిన్న తరహా శాటిలైట్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు అందుబాటు ధరలో ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.


స్కైరూట్ కంపెనీ ప్రకారం... విక్రమ్ 1 అప్పర్ స్టేజ్ ఇంజిన్-రామన్ కదిలే భాగాలను కలిగి ఉంటుంది. ఇలాంటి పేలోడ్స్ కలిగి ఉన్న ఇతర ఇంజిన్ల కంటే దీని బరువు తక్కువ ఉంటుంది. మాన్యుఫాక్చరింగ్ ఉత్పాదకతలో 3డీ ప్రింటర్స్తో ఇది సాధ్యపడిందని సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. ఇది మొత్తం బరువును 50శాతం తగ్గించడమే కాదు,మొత్తం కాంపోనెంట్స్,లీడ్ టైమ్ను 80శాతం తగ్గిస్తుందన్నారు.

-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ ను చెడగొట్టారు కదరా.. దరిద్రుల్లారా -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications