ఇండియన్ ఏరో స్పేస్లోకి ప్రేవేట్ ప్లేయర్... ఆ మైల్స్టోన్ని చేరిన మొట్టమొదటి హైదరాబాద్ స్టార్టప్...
భారత్లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్లో ఈ మైల్ స్టోన్ని చేరిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ప్లేయర్ స్కైరూట్ కావడం గమనార్హం.
భారత ఏరో స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయి నుంచి పొందిన స్పూర్తితో స్కైరూట్ ముందడుగు వేసింది. విక్రమ్ సిరీస్ పేరుతో స్పేస్లో ఉపయోగించే కొన్ని వాహనాలను అభివృద్ది చేస్తోంది. చిన్న తరహా శాటిలైట్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు అందుబాటు ధరలో ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.


స్కైరూట్ కంపెనీ ప్రకారం... విక్రమ్ 1 అప్పర్ స్టేజ్ ఇంజిన్-రామన్ కదిలే భాగాలను కలిగి ఉంటుంది. ఇలాంటి పేలోడ్స్ కలిగి ఉన్న ఇతర ఇంజిన్ల కంటే దీని బరువు తక్కువ ఉంటుంది. మాన్యుఫాక్చరింగ్ ఉత్పాదకతలో 3డీ ప్రింటర్స్తో ఇది సాధ్యపడిందని సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. ఇది మొత్తం బరువును 50శాతం తగ్గించడమే కాదు,మొత్తం కాంపోనెంట్స్,లీడ్ టైమ్ను 80శాతం తగ్గిస్తుందన్నారు.

-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి..












Click it and Unblock the Notifications