ఇందిరాగాంధీ నా రాజకీయ గురువు: ప్రణబ్
ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తెచ్చిన జిఎస్టి సమాఖ్య స్పూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తెచ్చిన జిఎస్టి సమాఖ్య స్పూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
.పార్లమెంట్ సెంట్రల్హల్లో ఆదివారం నాడునిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సోమవారంతో ప్రణబ్ పదవీకాలం ముగియనుంది. 1969లో జూలైలో తాను తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టేనాటికి రాజ్యసభలో స్వాతంత్ర్యసమరయోధులు, అపర మేధావులు పార్లమెంట్లో ఉన్నారని ఆయయన గుర్తుచేశారు.

ఐదుసార్లు తాను రాజ్యసభసభ్యుడిగా , రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా సేవలందించిన విషయాన్ని ప్రస్తావించారు. తన వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన రాజకీయ గురువు ఇందిరాగాంధీ అని ఆయన చెప్పారు. ఆమె మహోన్నత నాయకురాలని ఆయన ప్రశంసించారు. భిన్నమతాలు, జాతులు, భాషల ప్రజలంతా ఒకే దేశం, ఒకే జెండా కింద ఉండడం గర్వకారణమన్నారు.
చట్టాలు చేయాల్సిన పార్లమెంట్లో అధికార, విపక్షాలు వాగ్వాదాలతో సమయాన్ని వృధా చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రణబ్ను ఘనంగా సన్మానించారు. ఎంపీలందరి సంంతకాలతో కూడిన పుస్తకాన్ని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రణబ్కు అందించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications