సవాల్: అక్రమ ఆస్తులు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా, కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే లక్ష్మి !
బెంగళూరు: తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే ఆ అస్తులను ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుల్లో ఒకరైన లక్ష్మి హెబ్బాళ్కర్ తన మీద ఆరోపణలు చేస్తున్న వారికి సవాలు విసిరారు.

ఈడీ నోటీసులు
అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు లక్ష్మి హెబ్బాళ్కర్ ఇటీవల నోటీసులు జారీ చేసిందని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు లక్ష్మి హెబ్బాళ్కర్ ను ఢిల్లీకి పిలిపించి విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు విచారణ చేసిన విషయంపై లక్ష్మి హెబ్బాళ్కర్ స్పందించారు.

సీబీఐకి కేసు ?
చాముండీదేవి మీద ప్రమాణం చేస్తున్నా, తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నారు. తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని, తన మీద ఈడీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు అనే విషయం తనకు తెలీదని లక్ష్మి హెబ్బాళ్కర్ చెప్పారు.

ఐటీ అధికారులు
హర్ష షుగర్స్ కంపెనీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆ కంపెనీ లావాదేవీల రికార్డులను ఇప్పటికే ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారని లక్ష్మి హెబ్బాళ్కర్ వివరించారు.

చట్టపరంగా బ్యాంక్ లోన్
తమకూరు డీసీసీ బ్యాంకులో లోను తీసుకున్న విషయంపై మాట్లాడిన లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నీ చట్టపరంగా జరిగాయని, తన ఆస్తులు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నామని, ఎక్కడా ఎలాంటి మోసం చెయ్యలేదని లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నారు.

బెస్ట్ క్రషింగ్ అవార్డు
హర్ష షుగర్స్ ఈసారి బెస్ట్ క్రషింగ్ అవార్డు సొంతం చేసుకుందని, రైతుల ప్రయోజనాల కోసం ఆ కంపెనీ పని చేస్తుందని అన్నారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే వెంటనే ఆ ఆస్తులు ప్రభుత్వానికి రాసివ్వడానికి సిద్దంగా ఉన్నానని లక్ష్మీ హెబ్బాళ్కర్ చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications