Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేం చేయాల్సింది చేస్తాం- కేంద్రానికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సంకేతం

Waqf amendment Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభ సమక్షానికి వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.

వక్ఫ్ బిల్లు గతంలో పార్లమెంట్ ముందుకు వచ్చినప్పటికీ- అది ఆమోదం పొందలేదు. అందులో సవరణలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జగదంబికా పాల్ దీనికి సారథ్యాన్ని వహించారు.

If Waqf Amendment Bill passed We will start a nationwide movement says AIMPLB

ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది.

ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది. ఆయా రాష్ట్రాల వక్స్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ ఛైర్మన్లతో మాట్లాడింది.

ఇప్పటివరకు ఈ జేపీసీ 38 సార్లు సమావేశమైంది. వక్స్ హెూదా, జిల్లా కలెక్టర్‌కు అధికారాలను అప్పగించడం, వక్స్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలను కల్పించడం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. జేపీసీకి 44 సవరణలు సైతం అందాయి. వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదం లభించింది.

ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఘాటుగా స్పందించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదని డిమాండ్ చేసింది. దీన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. వక్ఫ్ ప్రయోజనాలు, ఉద్దేశాలకు విఘాతంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజల్-వుర్- రహీం ముజాద్దిదీ, అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన సవరణలు వక్ఫ్ బిల్లును మరింత క్లిష్టంగా మార్చాయని అన్నారు. జేపీసీ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

ఈ బిల్లు వివక్షతతో కూడుకున్నదని ధ్వజమెత్తారు. ఒక మతాన్ని ప్రేరేపించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. మతతత్వ కోణంలో చూడటం, అదే తరహాలో ఈ బిల్లును రూపొందించడం, దాన్ని సభలో ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. దేశ ప్రయోజనాలకు సైతం ఇది దెబ్బ తీస్తుందని వఇందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు గానీ, వివిధ రాష్ట్రాల మైనారిటీ కమిషన్లు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అభ్యంతరాలను జేపీసీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. తాము చూస్తూ కూర్చోబోమని తేల్చి చెప్పారు.

దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఖాసిం రసూల్ ఇల్యాస్ అన్నారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన, రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకుంటామని చెప్పారు. న్యాయస్థానాల్లో పోరాడతామని పేర్కొన్నారు. సవరణలను వెనక్కి తీసుకునే వరకు మేము శాంతియుతంగా ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు.

వక్ఫ్ చట్టాన్ని తొలగించే అవకాశం ఉందా..?

లేదు. వాకిఫ్ నుంచి ఆస్తులు అల్లాకు బదిలీ చేయడంవల్ల వాటిని తిరిగి పొందే అవకాశం లేదు.ఒక్కసారి ఆ ఆస్తులు వక్ఫ్‌కు చెందినవని అధికారికంగా ప్రకటించిన తర్వాత అవి ఎప్పటికీ వక్ఫ్ ఆస్తులుగానే నిలిచిపోతాయి.

వక్ఫ్ బోర్డు ఎవరి నియంత్రణలో ఉంటుంది..?

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్‌ను పర్యవేక్షిస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సంబంధించి పాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో కేంద్ర మంత్రి వక్ఫ్ ఇంఛార్జిగా వ్యవహరిస్తూ ఎక్స్ అఫీషియో ఛైర్మెన్‌గా ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+