Illegal affair: భర్త నచ్చలేదని విడాకులు, చీరల వ్యాపారితో ?, ఎర్రగా ఉందని యాసిడ్ పోసిన ప్రియుడు !
చెన్నై/ తిరునల్వేలి: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ అతనితో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనుగలేదు. రానురాను దంపతుల మద్య గొడవలు పెరిగిపోవడంతో ఇద్దరు విడిపోయారు. భర్తతో విడాకులు తీసుకున్న మహిళ ఆమె పుట్టింటిలో ఉంటున్నది. చీరల వ్యాపారం చేస్తున్న వ్యక్తి విడాకులు తీసుకున్న మహిళకు పరిచయం అయ్యాడు. చీరల వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతనితో ఎంజాయ్ చేసింది. వేరే ఊరిలో అద్దె ఇల్లు తీసుకున్న చీరల వ్యాపారి అతని ప్రియురాలని అక్కడికి పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ప్రవర్తనలో మార్పులు రావడంతో గొడవలు మొదలైనాయి. చూడటానికి ఎర్రగా ఉన్నావనే పొగరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నావని చీరల వ్యాపారి రగిలిపోయాడు. అక్రమ సంబందం పెట్టుకున్న ప్రియురాలి ముఖం మీ యాసిడ్ పోసిన ప్రియుడు చచ్చిపో అంటూ రెచ్చిపోయిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

దంపతుల మద్య గొడవలు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రం సమీపంలోని కల్లిడుకురచ్చి ప్రాంతంలో ముత్తులక్ష్మి అలియాస్ లక్ష్మీ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న లక్ష్మీ అతనితో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్మీ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

విడాకులు తీసుకుని పుట్టింటిలో ఉండిపోయింది
పెద్దలు పంచాయితీలు చేసినా లక్ష్మీ దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనుగలేదు. రానురాను లక్ష్మీ దంపతుల మద్య గొడవలు పెరిగిపోవడంతో ఇద్దరు విడిపోయారు. భర్తతో విడాకులు తీసుకున్న లక్ష్మీ ఆమె పుట్టింటిలో ఉంటున్నది. తల్లిదండ్రులు లక్ష్మీ బాగోగులు చూసుకుంటున్నారు.

లేడీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన చీరల వ్యాపారి
తేనీ జిల్లాలోని బోడినాయకరన్ గ్రామంలో నివాసం ఉంటున్న సెల్వం (43) చీరల వ్యాపారం చేస్తున్నాడు. చీరల వ్యాపారం చేస్తున్న సెల్వం విడాకులు తీసుకున్న లక్ష్మీకి పరిచయం అయ్యాడు. రానురాను లక్ష్మీ, సెల్వంల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. చీరల వ్యాపారం చేసే ముసుగులో సెల్వం లక్ష్మీతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ప్రియురాలి మీద డౌట్ ?
చీరల వ్యాపారి సెల్వంతో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మీ అతని చాలాకాలం పాటు ఎంజాయ్ చేసింది. దేవకోటై ఊరిలో అద్దె ఇల్లు తీసుకున్న చీరల వ్యాపారి సెల్వం అతని ప్రియురాలు లక్ష్మీని అక్కడికి పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మీ ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమెతో సెల్వం గొడవ పడటం మొదలు పెట్టాడు.

ప్రియురాలి మీద యాసిడ్ పోసి ఎస్కేప్
ప్రియుడు సెల్వం గొడవపడుతున్నా లక్ష్మీ ఏమాత్రం పట్టించుకోలేదు. చూడటానికి ఎర్రగా ఉన్నావనే పొగరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నావని లక్ష్మీ మీద సెల్వం రెచ్చిపోయాడు. చివరికి చీరల వ్యాపారి సెల్వం అతని ప్రియురాలు లక్ష్మీ మీద రగిలిపోయి కక్ష పెంచుకున్నాడు. అక్రమ సంబందం పెట్టుకున్న ప్రియురాలు లక్ష్మీ ముఖం మీ యాసిడ్ పోసిన ఆమె ప్రియుడు సెల్వుం నువ్వు ఇలాగే చచ్చిపో అంటూ రెచ్చిపోయి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. యాసిడ్ దాడితో తీవ్రగాయాలైన లక్ష్మీని ఆసుపత్రికి తరలించామని, సెల్వం కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications