Illegal affair: లవర్ తో ఆంటీ రొమాన్స్, మటన్ కత్తితో భర్తను ముక్కలు చేసి, తాగి వాగిన కొడుకు!
ఇండోర్: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువగా బయట తిరగడం మొదలుపెట్టింది. ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్తను పట్టించుకోకుండా అతని గురించి నిర్లక్షంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.
భార్య తీరుతో ఆమె భర్త విసిగిపోయాడు. మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త ప్రతిరోజూ అతని భార్యకు బెండ్ తీస్తూ ఆమెకు సెకండ్ షో సినిమా చూపిస్తూ వచ్చాడు. భర్తను చంపేయాలని అతని భార్య స్కెచ్ వేసింది. భర్తకు బిరియానీలో విషం, మత్తు మందు కలిపి పెట్టింది. భర్త మత్తులోకి జారుకోవడంతో అతని భార్య ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడు అతని స్నేహితుడు ప్రియురాలి ఇంటికి చేరుకున్నారు. ప్రియురాలి భర్తను ఆమె ప్రియుడు, అతని ఫ్రెండ్ కలిసి ఐదు ముక్కలుగా నరికేశారు. భర్తను ఐదు ముక్కలు చేపించిన భార్య ఆ శరీరంలోని భాగాలు ఐదు ప్రాంతాల్లో పడేసి చేతులు దులుపుకుంది.
ఆంటీ కొడుకు అతని ఫ్రెండ్స్ తో మద్యం సేవిస్తూ తన తండ్రిని తన తల్లి చంపేసిందని, అయినా ఈ వియం ఇంత వరకు బయటకు రాలేదని, ఏమైనా మా మమ్మీ చాలా బ్రిలియంట్ అని తాగిన మత్తులో వాగేశాడు. ఆంటీ కొడుకు ఫ్రెండ్ వాళ్లకు వీళ్లకు విషయం చెప్పడంతో ఆ మ్యాటర్ పోలీసులకు తెలీసిపోవడంతో అక్కడ అసలు సినిమా మొదలైయ్యింది.

దంపతుల హ్యాపీలైఫ్...... వయసుకు వచ్చిన కొడుకు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో బబ్లూ జాడోన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన సునీతా అనే మహిళను వివాహం చేసుకున్న బబ్లూ జాడోన్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశారు. బబ్లూ, సునీతా దంపతులకు ప్రశాంత్ (21) అనేకుమారుడు ఉన్నాడు. బబ్లూ సొంతంగా కారు తీసుకుని నడుపుకుంటున్నాడు.

మటన్ షాపు ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
సునీతా, బబ్లూ దంపతులు నివాసం ఉంటున్న ఊరిలోనే రిజ్వాన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రిజ్వాన్ మటన్ షాను నిర్వహిస్తున్నాడు. మటన్ షాను ఓనర్ రిజ్వాన్ తో సునీతాకు పరిచయం అయ్యింది. డ్రైవర్ మొగుడు బబ్లూ ఎక్కువగా బయట తిరుగుతుండటంతో సునీతా మటన్ షాపు ప్రియుడు రిజ్వాన్ తో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ప్రియుడి మోజులో భర్తను దూరం పెట్టింది
కొన్ని సంవత్సరాల క్రితం నుంచి సునీతా, ఆమె ప్రియుడు రిజ్వాన్ తో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. ఇదే విషయంలో బబ్లూ, సునీతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య సునీతా ఆమె బాయ్ ఫ్రెండ్ రిజ్వాన్ తో ఎక్కువగా బయట తిరగడం మొదలుపెట్టింది. ప్రియుడు రిజ్వాన్ మోజులో పడిన సునీతా ఆమె భర్త బబ్లూను రానురాను పట్టించుకోకుండా అతని గురించి నిర్లక్షంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

భార్యకు సెకండ్ షో సినిమా చూపించాడు
ఇదే విషయంలో బబ్లూ, సునీతా దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. భార్య సునీతా తీరుతో ఆమె భర్త బబ్లూ విసిగిపోయాడు. మద్యం సేవించి ఇంటికి వెలుతున్న బబ్లూ ప్రతిరోజూ అతని భార్య సునీతాను బెండ్ తీస్తూ ఆమెకు సెకండ్ షో సినిమా చూపిస్తూ వచ్చాడు. భర్త బబ్లూ దెబ్బతో రగిలిపోయిన భార్య సునీతా అతన్ని చంపేయాలని స్కెచ్ వేసింది.

బిరియానీలో విషం కలిపి భర్తకు పెట్టిన భార్య
ఫిబ్రవరి 5వ తేదీన సునీతా ఆమె భర్త బబ్లూకు బిరియానీలో విషం, మత్తు మందు కలిపి పెట్టింది. భర్త బబ్లూ మత్తులోకి జారుకోవడంతో అతని భార్య సునీతా ఆమె ప్రియుడు రిజ్వాన్ ఖాన్ కు ఫోన్ చేసింది. ప్రియుడు రిజ్వాన్ ఖాన్ మటన్ షాపు నిర్వహిస్తున్న అతని స్నేహితుడు భయ్యూతో కలిసి అతని ప్రియురాలు సునీతా ఇంటికి చేరుకున్నారు.

భర్త శరీరంలోని ఐదు ముక్కలు ఐదు చోట్ల విసిరేశారు
రిజ్వాన్ అతని స్నేహితుడు భయ్యూతో కలిసి మటన్ కత్తిరించే కత్తితో ప్రియురాలు సునీతా భర్త బబ్లూను ఐదు ముక్కలుగా నరికేశారు. ఫిబ్రవరి 6వ తేదీన భర్త బబ్లూను ఐదు ముక్కలు చేపించిన భార్య తల, మొండెంను ఇంటి వెనుక ఉన్న సెప్టింక్ ట్యాంక్ లో పడేసింది. రెండు కాళ్లు, రెండు చేతులను ప్రియుడు రిజ్వాన్ ఖాన్, భయ్యూ సహాయంతో అడవిలో విసిరేసింది. భర్త బబ్లూ శరీరంలోని భాగాలు ఐదు ప్రాంతాల్లో పడేసిన సునీతా చేతులు దులుపుకుంది.

మద్యం మత్తులో వాగేసిన కొడుకు
సునీతా ఆంటీ కొడుకు ప్రశాంత్ శుక్రవారం అతని ఫ్రెండ్స్ తో మద్యం సేవిస్తూ తన తండ్రి బబ్లూను తన తల్లి సునీతా చంపేసిందని, అయినా ఈ వియం ఇంత వరకు బయటకు రాలేదని, ఏమైనా మా మమ్మీ చాలా బ్రిలియంట్ అని తాగిన మత్తులో వాగేశాడు. సునీతా ఆంటీ కొడుకు ప్రశాంత్ ఫ్రెండ్ వాళ్లకు వీళ్లకు విషయం చెప్పడంతో ఆ మ్యాటర్ పోలీసులకు తెలీసిపోయింది.

తల్లీ కొడుక్కి సినిమా చూపించిన పోలీసులు
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సునీతాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన భర్త బబ్లూ నిత్యం తనను టార్చర్ పెడుతున్నాడని, అందుకే తన స్నేహితుడు రిజ్వాన్ ఖాన్ తో కలిసి చంపేశానని సునీతా అంగీకరించింది. సునీతా, ఆమె కొడుకు ప్రశాంత్ ను అరెస్టు చేశామని, సునీతా ప్రియుడు రిజ్వాన్ ఖాన్, అతని ఫ్రెండ్ మటన్ షాపు యజమాని భయ్యూ పరారైనారని పోలీసులు అన్నారు. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్త బబ్లూను సునీతా అతి దారుణంగా చంపించిన విషయం బయటకు రావడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications