కబీర్ దాస్ సమాధి వద్ద టోపీ ధరించేందుకు తిరస్కరించిన యోగీ
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కబీర్ దాస్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వారు టోపీ ధరించాల్సిందిగా యోగీని కోరగా ఆయన తిరస్కరించారు. ఉత్తర్ ప్రదేశ్లో సమాధిని ప్రధాని మోడీ సందర్శించాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు యోగీ ఆదిత్యనాథ్ సమాధి దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వార్డెన్గా ఉన్న ఖాదిమ్ హుస్సేన్ సీఎంకు టోపీ ఇవ్వగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించడం కెమెరాల కంటికి చిక్కింది.
సంప్రదాయంలో భాగంగానే తాను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్కు టోపీని ఇచ్చినట్లు చెప్పిన ఖాదిమ్ హుస్సేన్... అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించాడు. టోపీని ధరించేందుకు నిరాకరించిన సీఎం...ఆ టోపీని తనతో పాటే తీసుకెళ్లారని ఖాదిమ్ తెలిపాడు. 2011లో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో ఓ మసీదుకు చెందిన మతగురువు ముస్లింలు ధరించే టోపీని బహూకరించగా... మోడీ తిరస్కరించాడు. అప్పట్లో ఇది పెద్ద వార్తగా నిలిచింది. అంతేకాదు మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలను ఒకేలా చూడాలని విపక్షాలు ధ్వజమెత్తాయి.

-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications