మనదేశంలో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఇదే..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 33 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులకు పాల్పడుతోంది అమెరికా. పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరించింది. ఇక ఇరాన్ సైతం ప్రతీకార దాడులను వేగవంతం చేసింది. అమెరికా భూతల దాడులు చేస్తే టెక్ సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇక యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి.
ప్రపంచ దేశాల్లో చమురు కొరత తీవ్రంగా ఉంది. ఎన్నో దేశాల్లో ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సరఫరాలో 20 శాతం హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది. అలాగే రోజూ భారత్ కు వచ్చే 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు హార్మూజ్ మీదుగానే వస్తుంటుంది. అలాగే భారత్ కు చెందిన 40 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులు, 54 శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతులు హార్మూజ్ జలసంధి మీదుగానే వస్తుంటాయి. ఈ పరిణామాల మధ్య భారత్ లో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే రాష్ట్రం గురించి తెలుసా..?
భారత్ లో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ తొలి స్థానంలో ఉంది. ఎడారి ప్రాంతంగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలోని డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ సరఫరాలో దాదాపు 20- 25 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. రాజస్థాన్ లోని బార్మర్- సంచార్ బేసిన్ లో అత్యధికంగా పెట్రోలియం లభ్యం అవుతుంది. ఇక్కడే మంగళ, భాగ్యం, ఐశ్వరియా ఆయిల్ ఫీల్డ్స్ లొకేట్ అయి ఉన్నాయి.

రాజస్థాన్ భూమి లోపల సాండ్ స్టోన్ కింది భాగంలో చమురు నిల్వలు ఉన్నాయి. వేల సంవత్సరాల ఆర్గానిక్ మెటీరియల్ పూడ్చబడి ఉంది. అధిక హీట్ అండ్ ప్రెషర్ కారణంగా చమురు ఏర్పడింది. ఈ ఆయిల్ ను కెర్న్ ఆయిల్ అండ్ గ్యాస్(వేదాంత) కంపెనీలు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి బయటకు తీస్తాయి. ఆ తర్వాత దాదాపు 700 కిలోమీటర్ల పొడవున్న హీటెడ్ పైప్ లైన్ ద్వారా గుజరాత్ లోని రిఫైనరీస్ కు దీన్ని తరలిస్తారు. ఇక రాజస్థాన్ తర్వాత రెండో స్థానంలో గుజరాత్ ఉంది. మూడో స్థానంలో అసోం ఉంది. నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయి.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications