IRCTC కీలక నిర్ణయం: రూ. 10 లక్షల రైల్వే ప్రమాద బీమా, మీరు ఇలా చేస్తే సరిపోతుంది
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తాజాగా ప్రయాణికులకు మేలు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ కొనుగోలు చేసిన వారికి ఈ నిర్ణయంతో ఆటోమేటిక్గా ప్రమాద బీమా వర్తించనుంది. కాగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మంది మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.
అయితే, టికెట్ బుక్ చేసుకునే కొందరిలో ప్రమాద బీమాను ఎంపిక చేసుకోవడం మర్చిపోతుంటారు. దీంతో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు బీమా ప్రయోజనాలకు దూరమవుతారు. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చాలా మంది ప్రయాణికులు బీమాను ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఐఆర్సీటీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అందరు ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్లో ఉన్న చిన్న మార్పు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే లభించే బీమా సదుపాయాన్ని డిఫాల్ట్ చేసింది. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఆటోమేటిక్గా బీమా సదుపాయం కలుగుతుంది.
ఐఆర్ఐటీసీ తాజా నిర్ణయతో వెబ్సైట్ లేదా యాప్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్ను ప్రత్యేకంగా ఎంచుకునే అవసరం లేదు. ఇక నుంచి ఆ ఆప్షన్ ను ఐఆర్సీటీసీ డిఫాల్ చేస్తోంది. దీంతో టికెట్లు అయిపోతాయేమోనని కొందరు తొందరలో బీమా చేయడం మర్చిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టికెట్ బుక్ చేసుకుంటే.. ఆటోమేటిక్గా ఇన్స్యూరెన్స్ కూడా తీసుకున్నట్లే అవుతుంది.
ఈ బీమాను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికుడికి రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పనీ చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ. 7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందవచ్చు. అంతేగాక, క్షతగాత్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల వరకు అందిస్తారు.
అయితే, బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ వివరాలు అందించకపోయినా.. నామినీ వ్యక్తి చనిపోయినా వారసులు ఈ బీమా ప్రయోజనాలు పొందుతారు. నామినీదారు లేదా ప్రయాణికులు ఈ బీమాను క్లైమ్ చేసుకువాలంటే సంబంధిత పత్రాలను తీసుకుని దగ్గర్లో ఉన్న బీమా సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లో బీమా తీసుకున్న వ్యక్తి వీటి ప్రయోజనాలు పొందుతారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications