మరో అద్భుతం: ఒకేసారి 83ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో
జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం ఇస్రో వెల్లడించింది.
బెంగళూరు: నూతన సంవత్సర ఆరంభంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రయోగానికి ఉపగ్రహ వాహన నౌక పీఎస్ఎల్వీ-37ను ఉపయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ బెంగళూరులో తెలిపారు. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. వీటి బరువు 500 కేజీలు. మూడు మాత్రమే మన దేశ ఉపగ్రహాలున్నాయి.

ఇవి కార్టోశాట్ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు. ఈ ఏడాది జూన్లో ఇస్రో రికార్డు సృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అంతకుముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది అయిదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో చైర్మన్ చెప్పారు. కాగా, ఇప్పటికే అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో.. ఒకేసారి 83ఉపగ్రహాలను పంపి మరో ఘనత సాధించనుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications