"హవాలా" తుట్టె కదిలించిన ఐటీ శాఖ.. 25 కోట్ల నగదు స్వాధీనం
ఢిల్లీ : హవాలా తుట్టె కదిలించారు ఐటీ శాఖ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ రాకెట్ చేధించారు. చాందినీ చౌక్ ఏరియాలో ఓ ప్రైవేట్ సంస్థపై అధికారులు దాడిచేయడంతో హవాలా భాగోతం గుట్టురట్టైంది. అక్రమంగా నిర్వహిస్తున్న వందకు పైగా లాకర్లను తెరిపించారు. 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని చెబుతున్నారు ఐటీ అధికారులు. హవాలాతో అక్రమ లావాదేవీలు నిర్వహించేవారు ఇలాంటి ప్రైవేట్ లాకర్లలో నగదు నిల్వలు దాచిపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులదయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో సాగే ఈ దందాలో హవాలా బ్రోకర్లకు పలువురితో సంబంధాలుంటాయని తెలిపారు.

హవాలా ద్వారా డబ్బు రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. ఇలాంటి భారీ లాకర్ ఆపరేషన్లలో భాగంగా ఈ ఏడాదిలోనే ఇది మూడో సంఘటన కావడం గమనార్హం.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications