మోదీ,షా,అప్ప స్కెచ్,బీజేపీలో చేరిన మాజీ సీఎం,సోనియా గాంధీకి, రాహుల్ కు షాక్!
లోక్సభలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు గతంలో కాంగ్రెస్లో చేరిన నేతలను మళ్లీ వెనక్కి రప్పించడంలో బీజేపీ నేతలు ఎట్టకేలకు విజయం సాధించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఢిల్లీలో అధికారికంగా తిరిగి బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, జగదీష్ శెట్టర్లు గురువారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు.
చర్చల సమయంలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ను తిరిగి బీజేపీలోకి రప్పించడంలో, ఆయన్ను ఒప్పించడంలో అమిత్ షా విజయం సాధించారు. అమిత్ షాతో చర్చలు జరిపిన అనంతరం మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీలో చేరాడానికి లైన్ క్లియర్ అయ్యింది. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంపై అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత యడ్యూరప్ప, విజయేంద్ర పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జేపీ నడ్డాతో సమావేశమై చర్చించిన తరువాత మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అధికారంగా బీజేపీలో చేరారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగదీష్ శెట్టర్ ప్రస్తుతం విధానపరిషత్ సభ్యుడు. జగదీష్ శెట్టర్ విధానపరిషత్ చైర్మన్ హొరట్టికి ఫోన్ చేసి ఆయన రాజీనామాపై మాట్లాడారు. తన రాజీనామా లేఖను ఈ-మెయిల్ ద్వారా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు పంపినట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ రాకపోవడంతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్లో చేరగా, మాజీ డీసీఎం లక్ష్మణ్ సవది కూడా కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదంతా గ్రహించిన మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఏదో ఒకటి చేసి జగదీష్ శెట్టర్ ను బీజేపీలోకి తీసుకువస్తానని శపథం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హైకమాండ్ని ఒప్పించి లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీకి లాభం చేకూర్చేలా నేరుగా అమిత్ షాతో కలిసి జగదీష్ షెట్టర్తో మాట్లాడారు.
ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಜೆ. ಪಿ. ನಡ್ಡಾ ಅವರನ್ನು ಇಂದು ನವದೆಹಲಿಯಲ್ಲಿ ಪಕ್ಷಕ್ಕೆ ಸೇರ್ಪಡೆಗೊಂಡ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @JagadishShettar ಅವರು ಭೇಟಿಯಾದರು.
— BJP Karnataka (@BJP4Karnataka) January 25, 2024
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @BYVijayendra ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @BSYBJP ಮತ್ತು ಪ್ರಮುಖರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. pic.twitter.com/Ge7iSzqMrQ
సీనియర్ల మాటలు విని జగదీష్ శెట్టర్ను సొంత పార్టీలో చేర్చుకోవడానికి అమిత్ షా అంగీకరించారని తెలిసింది. అమిత్ షా, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పక్కా ప్లాన్ చేసి బీఎల్ సంతోష్ కు ఏమాత్రం మ్యాటర్ లీక్ కాకుండా జగదీష్ శెట్టర్ ను బీజేపీలో చేర్పించడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ లో ఉన్న ఇంకా కొంత మంది నాయకులు త్వరలో బీజేపీలో చేరుతారని సీనియర్ బీజేపీ నాయకుడు ఒకరు అంటున్నారు.
ಮರಳಿ ಬಿಜೆಪಿಗೆ ಬರುತ್ತಿರುವುದು ಸಂತೋಷ ವಿಚಾರವಾಗಿದೆ. ದೇಶದ ಹಿತಕ್ಕಾಗಿ ಶ್ರಮಿಸುತ್ತಿರುವ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯಾಗಿಸುವ ಸಂಕಲ್ಪದೊಂದಿಗೆ ಬಿಜೆಪಿಗೆ ಮರಳಿದ್ದೇನೆ.
— BJP Karnataka (@BJP4Karnataka) January 25, 2024
- ಶ್ರೀ @JagadishShettar, ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು pic.twitter.com/klg0ec6SPn












Click it and Unblock the Notifications