జయలలితకు 4 ఏళ్లలో సెప్టెంబర్ 27వ తేదీ ఏం జరిగింది: జైలు, సీఎం, అపోలో, మృతిపై విచారణ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మూడు సంవత్సరాలు సెప్టెంబర్ నెల 27న వేర్వేరు ఘటనలు ఎదురైనాయి. వరుసగా మూడు సంవత్సరాల్లో ఒక సెప్టెంబర్ నెలలోనే అమ్మ జయలలిత సంతోషంగా ఉన్నారు. మిగిలిన రెండు సెప్టెంబర్ నెలలు విషాదంలో ఉన్నారు. ఇప్పుడు అందరికీ దూరం అయ్యారు.
జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష పడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2014లో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు. 2014లో సెప్టెంబర్ 27వ తేదీన పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జయలలిత శిక్ష అనుభవిస్తూ ఉన్నారు.
అక్రమాస్తుల కేసులో బెయిల్ రావడంతో జయలలిత జైలు నుంచి బయటకు వచ్చారు. 2015లో శాసన సభ ఎన్నికల్లో 134 సీట్లు సొంతం చేసుకున్న జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2015 సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత సీఎం హోదాలో చెన్నైలో ఉన్నారు.
తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించిన డీజీపీ, అదనపు బలగాలు, ఇవే కారణాలు!
2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి అనారోగ్యానికి గురైన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. 2016 సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందారు. అదే సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించారు. 2017 సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత మరణంపై ప్రత్యేక కమిషన్ కమిటి విచారణ మొదలు పెట్టింది. ఇలా సెప్టెంబర్ నెలలో వరుసగా జయలలితకు వేర్వేరు ఘటనలు ఎదురైనాయి.