వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజీ ఎదుటే చేతులు నరికి విద్యార్థిని దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

రామ్‌గఢ్: జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను చదువుతున్న కళాశాల ఎదురుగానే 30ఏళ్ల బీఈడీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. చేతులు నరికేసి దుండగులు, ఆమె తలపై మోది హత్య చేశారు.

వివరాల్లోకి వెళితే.. వివాహిత అయిన సోనాలి మర్మ్(30) రామ్‌గఢ్‌లోని‌ ఓ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ సుకేన్ మండల్ అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఆమెకు పెళ్లైనా కానీ అతడు వెంటపడటం మానలేదు.

Jharkhand Student Found With Her Hands Chopped Off, Head Smashed

అతని ప్రేమను అంగీకరించకపోవడంతో సోనాలీపై మండల్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సుకేన్ మండల్.. సోనాలిని హత్య చేసి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రోజూ సోనాలిని భర్త తన బైక్‌పై కాలేజీ వద్ద దిగబెట్టి వచ్చేవాడని, కానీ, బుధవారం సోదరుడి బండి మీద ఆమె కాలేజీ వెళ్లిందని సోనాలి కుటుంబసభ్యులు తెలిపారు. అతడు కాలేజీ నుంచి తిరిగొచ్చేలోపే ఈ దారుణం జరిగిపోయిందని రోదించారు.

English summary
A woman studying to become a teacher has been found dead right outside her Jharkhand college, her head smashed and her hands severed. Disturbing photos show one of her amputated hands lying near her body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X