కాలేజీ ఎదుటే చేతులు నరికి విద్యార్థిని దారుణ హత్య
రామ్గఢ్: జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గఢ్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను చదువుతున్న కళాశాల ఎదురుగానే 30ఏళ్ల బీఈడీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. చేతులు నరికేసి దుండగులు, ఆమె తలపై మోది హత్య చేశారు.
వివరాల్లోకి వెళితే.. వివాహిత అయిన సోనాలి మర్మ్(30) రామ్గఢ్లోని ఓ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ సుకేన్ మండల్ అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఆమెకు పెళ్లైనా కానీ అతడు వెంటపడటం మానలేదు.

అతని ప్రేమను అంగీకరించకపోవడంతో సోనాలీపై మండల్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సుకేన్ మండల్.. సోనాలిని హత్య చేసి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రోజూ సోనాలిని భర్త తన బైక్పై కాలేజీ వద్ద దిగబెట్టి వచ్చేవాడని, కానీ, బుధవారం సోదరుడి బండి మీద ఆమె కాలేజీ వెళ్లిందని సోనాలి కుటుంబసభ్యులు తెలిపారు. అతడు కాలేజీ నుంచి తిరిగొచ్చేలోపే ఈ దారుణం జరిగిపోయిందని రోదించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications