ఉచిత బస్సు మహిళలకు మాత్రమే కాదు..!!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించడానికి, విద్యార్థులకు మరింత మెరుగైన రవాణా వసతి కల్పించడానికి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఉచిత బస్సు సౌకర్యం.. ఎల్ కే జీ నుంచి ప్రీ యూనివర్శిటీ కోర్స్ (పీయూసీ) అంటే ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ వరకు విద్యను బోధించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అందరికీ దీన్ని వర్తింపజేసింది.
ప్రస్తుతం కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉంటోన్న విషయం తెలిసిందే. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు. దీనికోసం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో- కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. కొత్త కొత్త రూట్లల్లోనూ బస్సులను నడిపిస్తోంది.
ಸರ್ಕಾರಿ ಶಾಲಾ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯ ಉಜ್ವಲಕ್ಕೆ ಸರ್ಕಾರ ಬದ್ಧ!
— DK Shivakumar (@DKShivakumar) July 11, 2025
ರಾಜ್ಯಾದ್ಯಂತ ಕರ್ನಾಟಕ ಪಬ್ಲಿಕ್ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಎಲ್'ಕೆಜಿಯಿಂದ ಪಿಯುಸಿ ತನಕ ಓದುವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ಬಸ್ ವ್ಯವಸ್ಥೆ ಆರಂಭಿಸಲು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನಿಸುವ ಮೂಲಕ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಗಳ ಬಲವರ್ಧನೆಗೆ ಪ್ರಮುಖ ಒತ್ತು ನೀಡಲಾಗುತ್ತಿದೆ.#KarnatakaPublicSchool pic.twitter.com/tnvwFFEMij
ఇప్పుడు తాజాగా విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అవసరమైన మొత్తాన్ని వార్షిక బడ్జెట్ లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మందికి విద్యార్థులకు లబ్ది కలుగుతుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications