సీఎంకు చివాట్లు పెట్టిన బీజేపీ మహిళా ఎంపీ, ధైర్యం ఉంటే గోవాలో, చాలెంజ్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కావాలనే రైతులను రెచ్చగొట్టించి తమ కార్యాలయం ముందు ధర్నా చెయ్యాలని చెప్పారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఉడిపి-చిక్కమగళూరు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ శోభా కరందాజ్లే ఆరోపించారు. సీఎంకు గోవాలోని సొంత పార్టీ పెద్దలతో మాట్లాడే సత్తా లేకపోవడంతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడాలని ఆమె సవాలు విసిరారు.

కేపీసీసీ కార్యాలయం
మహాదాయి తాగునీటి ప్రాజెక్టు విషయంలో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

సీఎంకు సవాలు !
బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీ ప్రభుత్వానికి చేతనైతే గోవాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి మహాదాయి తాగు నీటి ప్రాజెక్టుకు అడ్డుపడకుండా చూడాలని ఆమె సవాలు చేశారు.

పోలీసులతో బెదిరిస్తున్నారు !
మహాదాయి తాగునీటి ప్రాజెక్టు కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తుంటే సీఎం సిద్దరామయ్య పోలీసులను రెచ్చగొట్టించి రైతులు, ప్రజలను భయపెడుతున్నారని, లాఠీలతో కొట్టిస్తున్నారని ఎంపీ శోభా కరందాజ్లే ఆరోపించారు.

గోవా నాయకుల కోసం !
తాగునీటి కోసం ప్రజలు ఆందోళన చేస్తుంటే గోవాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారని లోక్ సభ సభ్యురాలు శోభా కరందాజ్లే ఆరోపించారు.

మంత్రి ఎందుకు రాలేదు !
మహాదాయి తాగు నీటి ప్రాజెక్టు కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే కేపీసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావ్, మంత్రి ఎంబీ. పాటిల్ ఇక్కడికి ఎందుకు రాలేదని శోభా కరందాజ్లే ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన ఎంపీ శోభా కరందాజ్లేతో సహ బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేసి బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications