లాయర్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు, సార్ 14 ఏళ్లు ఏం చేశారంటే!
బెంగళూరు: ఓ లాయర్ అతని తెలితేటలతో సుమారు 14 ఏళ్ల పాటు ఇంటి యజమానిని నానా ఇబ్బందులకు గురి చేశాడు. 2009లో నివాస భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ను స్నేహితుడి నుంచి మూడేళ్లపాటు లీజుకు తీసుకుని, 14 ఏళ్లపాటు ఆక్రమించిన న్యాయవాదిని 60 రోజుల్లోగా ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రూ. 10,00,000 ప్రీమియం చెల్లించి మూడేళ్ల కాలానికి అగ్రిమెంట్ ఉందని, 2009లో స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆ ఇంటిని ఖాళీ చేయకుండా దాదాపు 14 ఏళ్లుగా ఆస్తిలో భాగం కావాలని లాయర్ వేధిస్తున్నాడని ఇంటి ఓనర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్పీ. సందేశ్ 60 రోజుల్లో ఇంటిని ఖాళీ చెయ్యాలని ఆ లాయర్ కు ఆదేశాలు జారీ చేశారు.

లీజుకు తీసుకున్న ఇంట్లో ఉన్న న్యాయవాది ఎల్. దొరస్వామిని ఈ ఉత్తర్వులు వెలువడిన 60 రోజుల్లోగా ఖాళీ చేయాలని, ఒకవేళ ఖాళీ చేయకుంటే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవాలని అధికారులకు కర్ణాటక హైకోర్టు సూచించింది. ఇంటిని ఖాళీ చేసే సమయంలో ఆ న్యాయవాది చెల్లించిన ప్రీమియం రూ. 10,00,000 డబ్బును ఇంటి యజమాని తిరిగి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
లాయర్ దొరస్వామిని ఖాళీ చేయించాలని దాఖలైన పిటిషన్ను దిగువ కోర్టు తిరస్కరించడంతో ఇంటి యజమాని కృష్ణప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. 2009లో రూ.10 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ రావడంతో మల్లేశ్వరంలోని ఓ ప్రాంగణంలోని గ్రౌండ్ ఫ్లోర్ ను తన స్నేహితుడు, న్యాయవాది దొరస్వామికి రూ.3, 400 అద్దెకు ఇచ్చాడు.
మూడేళ్లు ఆలస్యంగా అద్దె చెల్లించలేని ఓ న్యాయవాది దానిని డిపాజిట్లో మినహాయించాలని కోరారు. కృష్ణప్రసాద్ 2016లో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కానీ దొరస్వామి అద్దె కంట్రోలర్ను సంప్రదించగా నెలకు రూ. 21వేలు అద్దెగా నిర్ణయించారు. అది కూడా చెల్లించలేదని కృష్ణప్రసాద్ ఆరోపించారు. రెంట్ కంట్రోలర్ ఆదేశాలపై కృష్ణప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను చిన్న కారణాలతో కోర్టు కొట్టివేసింది.
అనంతరం ఇంటి ఓనర్ హైకోర్టును ఆశ్రయించారు. దొరస్వామి ఇంట్లో కొనసాగేందుకు లేనిపోని కారణాలు చెబుతున్న విషయాన్ని హైకోర్టు గుర్తించింది. దొరస్వామి తీరును ట్రయల్ కోర్టు గమనించలేకపోయిందని హైకోర్టు పేర్కొంది.ట్రయల్ కోర్టు ప్రతివాది ప్రవర్తనను గమనించదు. ప్రతివాది ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అయిన కౌలుదారు.
ఇంటి యజమాని లాయర్ దొరస్వామి ఇంటిని ఖాళీ చెయ్యడానికి లేనిపోని కారణాలు చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికి సంబంధించి కిందికోర్టు ఆదేశాలను తోసిపుచ్చిన కర్ణాటక హైకోర్టు దొరస్వామికి వ్యతిరేకంగా ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications