కరెక్ట్ టైమ్ లో హ్యాండ్ ఇచ్చిన నటి ఖుష్బు, నావల్లకావడంలేదని లేఖ, ఏం జరిగిందంటే ?
దేశంలో మొత్తం లోక్ సభ ఎన్నికల వేడితో హాట్ హాట్ గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్స్ చాలా మంది ఉన్నారు. తమిళనాడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ ప్రధాన స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత బీజేపీలో చేరిన తర్వాత తొలి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న నటి ఖుష్బు బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు.
బీజేపీ తరపున లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ పార్టీ నాయకుల తరఫున అండగా నిలబడాల్సిన నటి ఖుష్బు చేతులు ఎత్తేశారు. అయితే ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోవాలని ఖుష్బు నిర్ణయించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చెయ్యాలని చాలా మంది ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

2019లో ఢిల్లీలో జరిగిన ఓ ప్రమాదంలో తన కాలికి గాయం అయ్యిందని, అదే కారణంతో తాను ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేకపోతున్నానని నటి ఖుష్బు లేఖలో పేర్కొన్నారని వెలుగు చూసింది. తన కాలు ఫ్రాక్చర్ అయిందని, ఈ గాయం గత ఐదేళ్లుగా తనను వేధిస్తున్నదని నటి ఖుష్బు జేపీ నడ్డాకు రాసిన లేఖలో వివరించారని సమాచారం. లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనవద్దని వైద్యుల సలహా ఇచ్చారని, అయినా తాను తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో ప్రచారాన్ని కొనసాగాలని అనుకున్నానని ఖుష్బు వివరించారు.

అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఇప్పుడు అవసరమైన విరామం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు నటి ఖుష్బు భావోద్వేగంతో లేఖ రాశారని వెలుగు చూసింది.ప్రస్తుతం తన కార్యకలాపాలను తగ్గించవలసి ఉందని, ప్రత్యేకించి విస్తృతమైన ప్రయాణాలు చెయ్యకూడదని, ఎక్కువ సేపు నిలబడకూడదని వైద్యులు సూచించారని నటి ఖుష్బు బీజేపీ హైకమాండ్ కు రాసిన లేఖలో వివరించారు.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మానేయాలి వైద్యులు సూచించారని, అందుకే తాను ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అవకాశం లేకపోయిందని, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని బావిస్తున్నానని నటి ఖుష్బు లేఖ రాశారు ప్రత్యక్ష ప్రచారం నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ కోసం తాను పని చేస్తానని నటి ఖుష్బు వివరించారు. బీజేపీ విధానాలు, కార్యక్రమాల కోసం తనపనిని కొనసాగించేందుకు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉంటానని లేఖలో స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న నటి ఖుష్బు అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి విరామం తీసుకోవడం గమనార్హం. ఇది ఆరోగ్య సమస్య లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ ఇప్పటికే మొదలయ్యింది. మొత్తం మీద నటి ఖుష్బు లోక్ సభ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. .
-
రాష్ట్రపతికి అవమానం? దీదీ వర్సెస్ ఢిల్లీ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications