బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Former CM: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఊపిరిపీల్చుకున్న మాజీ సీఎం, డీనోటిఫికేషన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి డీ నోటిఫికేషన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన డీ నోటిఫికేషన్ దెబ్బతో అప్పుడే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. చాలా సంవత్సరాల తరువాత మాజీ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టుకు హాజరై డీ నోటిఫికేషన్ కు సంబంధించిన కేసులో తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేశారు. మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అఫిడవిట్ దాఖలు చెయ్యడానికి సమయం కావాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. ఇప్పటికే ఈ అక్రమ డీ నోటిఫికేషన్ కేసు విచారణ నుంచి కొందరు తప్పించుకున్నారు. డీనోటిఫికేషన్ కేసు విచారణకు సంబంధించి మాజీ సీఎంకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మాజీ సీఎం ఊపిరిపీల్చుకున్నారు.

Wife: భార్య బ్యాంక్ మేనేజర్, భర్త ?, భార్యను 20 సార్లు పొడిచి, గొంతు చీల్చి చంపేశాడు, టెర్రాస్ లో!Wife: భార్య బ్యాంక్ మేనేజర్, భర్త ?, భార్యను 20 సార్లు పొడిచి, గొంతు చీల్చి చంపేశాడు, టెర్రాస్ లో!

 15 ఎకరాల భూమి డీ నోటిఫికేషన్

15 ఎకరాల భూమి డీ నోటిఫికేషన్

కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరులో ఐటీ కారిడార్ నిర్మాణం కోసం బెళ్లందూర్, దేవర బీసనహళ్లిలో 15 ఎకరాల 30 గుంటల భూమిని డీ నోటిఫికేషన్ చేశారు. ఆ సమయంలో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వ నియమాలు పక్కన పెట్టి సీఎం హోదాలో అక్రమంగా డీ నోటిఫికేషన్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 యడియూరప్పకు కష్టాలు

యడియూరప్పకు కష్టాలు

ముఖ్యమంత్రి హోదాలో బీఎస్. యడియూరప్ప అక్రమంగా డీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపిస్తూ 2013లో వాసుదేవరెడ్డి అనే ఆయన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. బీఎస్. యడియూరప్పతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు0 ఆర్.వీ. దేశ్ పాండ్ తదితరులు ఈ కేసులో ఉన్నారు.

 కోర్టు విచారణకు యడియూరప్ప

కోర్టు విచారణకు యడియూరప్ప

అక్రమ డీనోటిఫికేషన్ వివాదంలో చిక్కుకున్న బీఎస్. యడియూరప్ప అప్పట్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాత బెయిల్ తీసుకున్న యడియూరప్ప కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆర్ వీ. దేశ్ పాండే మీద వచ్చిన ఆరోపణలను 2015లో హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కొందరు విచారణ నుంచి విముక్తిపొందారు.

 కోర్టుకు స్వయంగా వెళ్లిన మాజీ సీఎం

కోర్టుకు స్వయంగా వెళ్లిన మాజీ సీఎం

ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి బెంగళూరులో డీనోటిఫికేషన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని గత నెల జూన్ 17వ తేదీన బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్వయంగా కోర్టుకు హాజరై డీ నోటిఫికేషన్ కు సంబంధించిన కేసులో తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేశారు.

 సుప్రీం కోర్టుకు మాజీ సీఎం

సుప్రీం కోర్టుకు మాజీ సీఎం

బీఎస్ యడియూరప్ప కేసులో పోలీసు అధికారులు కోర్టుకు బి రిపోర్టు సమర్పించారు. బీఎస్, యడియూరప్ప అక్రమంగా డీనోటిఫికేషన్ చేశారని మాకు ఎలాంటి సాక్షాలు చిక్కలేదని పోలీసులు కోర్టులో బి రిపోర్టు సమర్పించారు. తన మీద అక్రమంగా క్రిమినల్ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారని, ఆ కేసులో తన మీద చర్యలు తీసుకోకూడదని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

 ఊపిరిపీల్చుకున్న యడియూరప్ప

ఊపిరిపీల్చుకున్న యడియూరప్ప

అయితే కర్ణాటక హైకోర్టులో బీఎస్ ,యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. చివరికి బీఎస్ యడియూరప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సూచించిన సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Land denotification Case: Karnataka former CM BS Yediyurappa gets relief from Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X