Loan: సీఎం చెప్పినా మాట వినని బ్యాంక్ అధికారులు ?, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు ? ఏం జరిగిందంటే !
బెంగళూరు/రాయచూరు: రైతు ఆయన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించాడు. ఇటీవల ఆ రైతు పంట పెట్టడానికి తెలిసినవాళ్ల దగ్గర, బ్యాంకులో రుణం తీసుకుని చేతులు కాల్చుకోవడంతో ఆ కుటంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.
Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని బి. యుద్దాపురం గ్రామంలో నాగప్ప అనే ఆయన నివాసం ఉంటున్నాడు. నాగప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నాగప్ప ఆయన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న నాగప్ప అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించాడు.
గత ఏడాది నాగప్ప పంట పెట్టడానికి తెలిసినవాళ్ల దగ్గర, బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం తీసుకుని పంట పెట్టినా నాగప్పకు పంట చేతికి రాలేదు. వ్యవసాయంలో తీవ్ర నష్టం రావడంతో నాగప్ప సతమతం అయ్యాడు. అప్పు ఇచ్చిన వాళ్లు వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగప్ప మీద ఒత్తిడి చేశారు.
Marriage: నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు, ఐదో వాడి కోసం వేటలో ?, మేడమ్ కు 32 ఫోన్ నెంబర్లు !
ఇదే సమయంలో బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలని నాగప్ప మీద ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి అన్నివైపులా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఏం చెయ్యాలో తెలీలేక నాగప్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ రైతులకు రుణం చెల్లించాలని ఒత్తిడి చెయ్యకూడదని బ్యాంక్ అధికారులను ఆదేశించిన సమయంలోనే నాగప్ప ఆత్మహత్య చేసుకున్నాడు.