Lovers: కాలేజ్ లవర్స్, ప్రియురాలికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్, ఒకే ఆసుపత్రిలో, షాక్ !
మంగళూరు: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు స్నేహితులు అయ్యారు. కాలేజ్ అయిన తరువాత కలిసి మాట్లాడుకుంటున్న స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు. ఇద్దరు జీవితాంతం కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. అమ్మాయి లవ్ మ్యాటర్ తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వేరే యువకుడితో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారు. వేరే యువకుడిని పెళ్లి చేసుకుని ప్రేమించిన ప్రియుడికి మోసం చెయ్యలేక ఆమె సతమతం అయ్యింది. ప్రేమికులు ఇద్దరూ విషం తాగేశారు. అయితే చికిత్స పొందుతున్న ప్రేమికులు చికిత్స విఫలమై ఒకే ఆసుపత్రిలో ప్రాణాలు వదిలేశారు.
ఒకే కాలేజ్ లో చేరారు
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హళియాళ ప్రాంతంలో జ్యోతి (19) అనే యువతి నివాసం ఉంటున్నది. ఇదే ప్రాంతంలో రికేష్ సురేష్ అలియాస్ సురేష్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. జ్యోతి, సురేష్ ఇద్దరూ మళియాళలోని హవగి ప్రభుత్వ కాలేజ్ లో డిగ్రీ చదువుకుంటున్నారు.
కాలేజ్ లవర్స్
కాలేజ్ లో చదువుతున్న జ్యోతికి, సురేష్ కు పరిచయం అయ్యింది. ఒకే కాలేజ్ లో చదువుతున్న సురేష్, జ్యోతి స్నేహితులు అయ్యారు. కాలేజ్ అయిన తరువాత కలిసి మాట్లాడుకుంటున్న జ్యోతి, సురేష్ కొంతకాలం తరువాత ప్రేమికులు అయ్యారు. ఇద్దరూ జీవితాంతం కలిసి జీవించాలని గత ఏడాది సురేష్, జ్యోతి డిసైడ్ అయ్యారు.
వేరే అబ్బాయితో ప్రియురాలి పెళ్లి ఫిక్స్
కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు జ్యోతి, సురేష్ డిసైడ్ అయ్యారు. అమ్మాయి జ్యోతి లవ్ మ్యాటర్ తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వేరే యువకుడితో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని జ్యోతి చెబుతున్నా ఆమె కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా పెళ్లికి ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టారు.
ఒకే ఆసుపత్రిలో ప్రేమికులు ?
వేరే యువకుడిని పెళ్లి చేసుకుని ప్రేమించిన ప్రియుడు సురేష్ కు మోసం చెయ్యలేక జ్యోతి సతమతం అయ్యింది. కొన్ని రోజుల నుంచి ప్రేమికులు జ్యోతి, సురేష్ ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. మన పెళ్లికి పెద్దలు అంగీకరించరని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సురేష్, జ్యోతి ఈనెల 15వ తేదీన ముండుగోడు రోడ్డులోని నిర్జన ప్రదేశంలో విషం తాగేశారు. అస్వస్థతకు గురైన జ్యోతి, సురేష్ ను హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమికులు చికిత్స విఫలమై ఒకే ఆసుపత్రిలో ప్రాణాలు వదిలేశారు.