రాజధాని ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ట్రక్: డ్రైవర్కు తీవ్ర గాయాలు
రత్లాం: మధ్యప్రదేశ్లో పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్ప్రెస్ రైలును.. ఓ ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. గోద్రా నుంచి రత్లాం మార్గంలో ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కు రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
లెవల్ క్రాసింగ్ను ఢీకొన్న ఆ ట్రక్కు.. ఆ తర్వాత ట్రివేండ్రం రాజధాని ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దీంతో ఆ రైలుకు సంబంధించిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రక్కు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లెవల్ క్రాసింగ్ను మూసివేశారు.
Madhya Pradesh: Truck rammed into a manned level crossing b/w Godhra & Ratlam & hit Trivandrum Rajdhani train.2 coaches derailed. Truck also damaged, driver critically injured. No injuries reported to any passenger. The crossing was closed for road traffic at the time of incident pic.twitter.com/rOcU6GM90C
— ANI (@ANI) October 18, 2018
గురువారం ఉదయం 6.44 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. దెబ్బతిన్న బోగీలకు చెందిన ప్రయాణికులను ఇతర బోగీలకు మార్చారు. ధ్వంసమైన బోగీలను వదిలేసి.. రాజధాని రైలు మళ్లీ బయలుదేరింది. ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.