Coronavirus: ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీ చేయండి, గవర్నర్ కొషియారికి మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం
కరోనా వైరస్ వల్ల మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగిపోయాయి. సీఎం ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి రాష్ర్ట ప్రభుత్వం తీర్మానం పంపించింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యక్ష్యంగా కానీ, పరోక్షంగా కానీ ఉద్దవ్ థాకరే ఎన్నిక కానీ సంగతి తెలిసిందే.
సీఎం పదవీ చేపట్టిన వ్యక్తి ఆరునెలల లోపు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. నవంబర్లో మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మే నెలలో అతను చట్టసభకు ఎన్నిక కావాలి. లేదంటే తన పదవీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహించారు. సమావేశంలో నిర్ణయం తీసుకొని తీర్మానం చేశారు. ఆ ప్రతిని గవర్నర్కు పంపించారు. దీనిపై కొషియారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు తేలకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. 1135 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 72 మంది చనిపోయారు. దీంతో వచ్చేనెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేశారు. అందుకోసమే మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications