Coronavirus: ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీ చేయండి, గవర్నర్ కొషియారికి మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం
కరోనా వైరస్ వల్ల మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగిపోయాయి. సీఎం ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి రాష్ర్ట ప్రభుత్వం తీర్మానం పంపించింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యక్ష్యంగా కానీ, పరోక్షంగా కానీ ఉద్దవ్ థాకరే ఎన్నిక కానీ సంగతి తెలిసిందే.
సీఎం పదవీ చేపట్టిన వ్యక్తి ఆరునెలల లోపు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. నవంబర్లో మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మే నెలలో అతను చట్టసభకు ఎన్నిక కావాలి. లేదంటే తన పదవీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహించారు. సమావేశంలో నిర్ణయం తీసుకొని తీర్మానం చేశారు. ఆ ప్రతిని గవర్నర్కు పంపించారు. దీనిపై కొషియారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు తేలకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. 1135 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 72 మంది చనిపోయారు. దీంతో వచ్చేనెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేశారు. అందుకోసమే మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications