Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ అవకాశాన్ని వదులుకోవద్దు: మానవతా కారిడార్లపై ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు ఎంబసీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్నప్పటికీ.. రష్యా కాల్పల విరమణను పలుమార్లు ప్రకటించింది. ఇతర దేశాల ప్రజలు తమ తమ దేశాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను మానవతా కారిడార్‌లను ఉపయోగించుకోవాలని, రైళ్లు లేదా వాహనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాలను ఉపయోగించి దేశం విడిచి వెళ్లాలని కోరింది.

మరోసారి మానవతా కారిడార్లు ఉండకపోవచ్చు: భారత ఎంబసీ

తదుపరి మానవతా కారిడార్ ఏర్పాటు అనిశ్చితంగా ఉందని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత పౌరులను కోరింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వ్యక్తుల తరలింపు కోసం మానవతా కారిడార్ మార్చి 8, 2022న 10.00 గంటల నుంచి ప్రకటించబడింది. భద్రతా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, తదుపరి మానవతా కారిడార్ ఏర్పాటు అనిశ్చితంగా ఉంది," అని రాయబార కార్యాలయం మంగళవారం ఒక అడ్వైజరీలో తెలిపింది.

ఏ అవకాశాన్ని వదలకుండా ఉక్రెయిన్ వదలిరండి: భారత ఎంబసీ

"ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రైళ్లు/వాహనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాలను ఉపయోగించి భద్రతను పరిగణనలోకి తీసుకుని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొంది. పౌరుల తరలింపు కోసం ఐదు ఉక్రేనియన్ నగరాలైన కైవ్, చెర్నిగోవ్, సుమీ, ఖార్కోవ్, మారియుపోల్ నుంచి మానవతా కారిడార్‌లను ప్రారంభిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించిందని స్పుత్నిక్ న్యూస్ నివేదించింది.

ఉక్రెయిన్ నుంచి 18వేల మంది విద్యార్థులు భారత్‌కు..

భారతదేశం ఇప్పటివరకు ఉక్రెయిన్ నుండి 18,000 మంది పౌరులను తిరిగి తీసుకువచ్చినప్పటికీ, రష్యన్ దళాల భారీ ఫిరంగి కాల్పుల కారణంగా విద్యార్థులు ఈశాన్య నగరమైన సుమీలో చిక్కుకుపోయారు. వారి తరలింపు రష్యన్, ఉక్రేనియన్ అధికారులు సురక్షితమైన మార్గం సులభతరం చేయడంపై ఆధారపడి ఉంటుంది. కాగా, సుమీ నుంచి కూడా భారతీయ విద్యార్థులను తరలించినట్లు ఎంబసీ వర్గాలు తెలిపాయి. సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని, వారిని బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నామని మంగళవారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

Recommended Video

    #RussiaUkraineConflict: దిక్కుతోచని స్థితిలో Indian Students సవాల్ గా Operation Ganga | Oneindia

    రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడిన ప్రధాని మోడీ, ఆ తర్వాతే..

    'నిన్న రాత్రి, నేను కంట్రోల్ రూమ్‌తో తనిఖీ చేసాను, 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో ఉన్నారు. ఈ రోజు, వారందరూ పోల్టావా కోసం బస్సులలో బయలుదేరారు" అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రేనియన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా, త్వరగా తరలించడంలో వారి మద్దతును కోరిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+