video viral:వామ్మో.. ఏంది, పుణ్యక్షేత్రం, నదిలో రొమాన్స్.. భర్తపై దాడి
ఎంత భార్య భర్తలయినా.. పబ్లిక్ ప్లేసులో జాగ్రత్తగా ఉండాలి. అంటే సరసాలు ఆడటం అంతా మంచిది కాదు. ఎందుకంటే.. వారు భార్య భర్తలు అని తెలియకుండా కొందరు దాడి చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే జరిగింది. కపుల్స్ సరయు నదిలో ఎంచక్కా స్నానం చేస్తున్నారు. అయితే భర్త ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం తప్పయిపోయింది. వాస్తవానికి అలా చేయద్దు కూడా.. ఇంకేముంది కొందరు చూశారు.. తమదైన శైలిలో బుద్దిచెప్పారు. భార్య ముందే చెంప చెల్ మనిపించారు.

భార్య భర్తల రొమాన్స్
ఆ జంట వద్దకు వచ్చి భర్తను పక్కకు లాగి పడేశారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. కొట్టుకుంటూ అతన్ని ఒడ్డుకు లాక్కెళ్లారు. పవిత్ర స్థలంలో ఇలాంటి పనులేంటని చెంపలు వాయించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం అయోధ్య పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అయోధ్యలో ఘటన..
పవిత్ర ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఈ ఘటన జరిగింది. సరయూ నదిలో స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారు. భార్య ముందే భర్తను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా ఆ వ్యక్తి తన భార్యకు ముద్దు పెట్టాడనే కారణంతో దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ భార్యాభర్తలు ఇద్దరు నదిలో స్నానం చేస్తుండగా కాస్త రొమాంటిక్గా వ్యవహరించారు. భర్త ఆమెకు ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే స్నానం చేస్తున్న కొందరు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
మంచి పద్దతి కాదు
పుణ్యక్షేత్రంలో భార్య భర్తలు అయినా ముద్దు పెట్టుకోవడం మంచి పద్దతి కాదు. అలాగని మిగతావారు దాడి చేయడం కూడా సరైంది కాదు. ఘటనను వీడియో తీసి.. పోస్ట్ చేశారు. దీంతో తెగ వైరల్ అవుతుంది. సో పుణ్యక్షేత్రంలో మంచి నడవడికతో నడచుకోవాలి.. లేదంటే ఎవరైనా గ్రూపు మిమ్మల్ని దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఘటన రుజువు చేసింది.












Click it and Unblock the Notifications