ముగిసిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు...భారీగా తరలివచ్చిన అభిమానులు
పనాజీ:ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. మిరామార్ బీచ్లో పారికర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నేతకు చివరి సారిగా వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పారికర్ అంతిమయాత్రలో ప్రజలు పాల్గొన్నారు. పాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ప్రజల్లో ఆయన అతి సామాన్య వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం కాలా అకాడమీలో పారికర్ భౌతికకాయాన్ని ఉంచారు. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు పారికర్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం దగ్గరే పారికర్ అతింమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.ఇక అంతిమయాత్రలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజీపీ పాలిత రాష్ట్రాల సీఎంలు అంతిమయాత్రకు హాజరయ్యారు. మనోహర్ పారికర్ మృతి పట్ల గోవా ప్రభుత్వం ఏడురోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. సోమవారం అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

63 ఏళ్ల పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. అంతేకాదు అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్నాక తిరిగి ఆయన విధుల్లో చేరారు. అయితే ఆ సమయంలో ముక్కులోనే ట్యూబ్తో సెక్రటేరియట్కు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఈ ఏడాది జనవరిలో తన చివరి శ్వాస వరకు గోవా ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన పారికర్ మాటమీద నిలబడ్డారని పలువురు గుర్తుచేసుకున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications